AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Hiked: సిగరెట్లు, గుట్కా, ఫాస్ట్ ఫుడ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. 40 శాతం పన్ను.. ఇక జేబుకు చిల్లులే..!

GST Hiked: పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా మార్చే దిశగా GST కౌన్సిల్ కూడా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. 12%, 28% పన్ను శ్లాబులను రద్దు చేశారు. ఇప్పుడు చాలా వస్తువులు 5% లేదా 18% శ్లాబులోనే ఉంటాయి. ఈ..

GST Hiked: సిగరెట్లు, గుట్కా, ఫాస్ట్ ఫుడ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. 40 శాతం పన్ను.. ఇక జేబుకు చిల్లులే..!
Subhash Goud
|

Updated on: Sep 04, 2025 | 7:46 AM

Share

GST Hiked: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో సామాన్య వినియోగదారులకు సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం వెలువడింది. చాలా వాటిపై జీఎస్టీ తగ్గింపు ఉండగా, కొన్నింటిపై మాత్రం భారీగా పెరిగింది. ఇప్పుడు సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, అన్ని పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ వస్తువులన్నింటిపై జీఎస్టీ రేటును నేరుగా 28% నుండి 40%కి పెంచింది. ఈ కొత్త రేటు 22 సెప్టెంబర్ 2025 నుండి వర్తిస్తుంది. పొగాకు ఉత్పత్తులే కాదు, ఇప్పుడు లగ్జరీ కార్లు, ఫాస్ట్ ఫుడ్, తీపి చక్కెర పానీయాలపై 40% పన్ను విధించనుంది కేంద్రం. అంటే ఇవి ఇప్పుడు మరింత ఖరీదైనవిగా కానున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ధర రూ.1.07 లక్షలు

సిగరెట్లు, పాన్ మసాలా ధరల్లో భారీ పెరుగుదల:

ప్రభుత్వ నిర్ణయం కారణంగా సిగరేట్లు, పాన్‌ మసాలాలు వాడేవారి జేబుపై మరింత ప్రభావం పడనుంది. ఉదాహరణకు సిగరెట్ ప్యాకెట్ ఇప్పుడు రూ. 256కు లభిస్తే కొత్త రేట్ల తర్వాత దాని ధర దాదాపు రూ. 280 ఉంటుంది. అంటే రూ. 24 ప్రత్యక్ష పెరుగుదల ఉంటుంది. అదేవిధంగా గుట్కా, జర్దా, నమిలే పొగాకు, పాన్ మసాలా వంటి ఉత్పత్తుల ధరలు కూడా వేగంగా పెరుగుతాయి. వాటిపై ఇప్పటికే అధిక రేట్లకు పన్ను, సెస్ వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ ఫుడ్ నుండి చక్కెర పానీయాల వరకు ప్రతిదానిపై 40% పన్ను విధించనుంది కేంద్రం. పొగాకు ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం అనేక ఇతర వస్తువులను కూడా 40% GST శ్లాబ్‌లోకి చేర్చింది. వీటిలో ఇవి ఉన్నాయి.

  • ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్
  • కార్బోనేటేడ్, రుచిగల చక్కెర పానీయాలు
  • సూపర్ లగ్జరీ కార్లు, వ్యక్తిగత విమానాలు
  • జర్దా, అదనపు చక్కెర ఉత్పత్తులు

రిటైల్ ధరపై పన్నుకు కొత్త నియమం:

పాత వ్యవస్థలో ఈ ఉత్పత్తులపై పన్ను వాటి లావాదేవీ విలువపై నిర్ణయించబడేది. కానీ ఇప్పుడు ఈ నియమం కూడా మారింది. ఇప్పుడు పన్నును రిటైల్ అమ్మకపు ధర (RSP) ఆధారంగా లెక్కించనున్నారు. ఇది పన్ను ఎగవేతను అణిచివేస్తుంది. కంపెనీలు నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే సెస్‌కు సంబంధించిన పాత అప్పులు తిరిగి చెల్లించనంత వరకు ఈ ఉత్పత్తులపై పన్నులో ఎటువంటి ఉపశమనం పొందే అవకాశం లేదు.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో వరుసగా 3 రోజులు పాఠశాలలకు సెలవులు!

ఈ వస్తువులన్నింటినీ ప్రభుత్వం ఇప్పుడు విలాస వస్తువులు వర్గంలోకి వస్తాయి. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే ఇటువంటి ఉత్పత్తులు ఆరోగ్యం, పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వాటి వినియోగాన్ని నియంత్రించడం అవసరం. అందుకే వీటిపై జీఎస్టీ మరింత పెంచింది కేంద్రం.

పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా మార్చే దిశగా GST కౌన్సిల్ కూడా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. 12%, 28% పన్ను శ్లాబులను రద్దు చేశారు. ఇప్పుడు చాలా వస్తువులు 5% లేదా 18% శ్లాబులోనే ఉంటాయి. ఈ మార్పు మధ్యతరగతికి కొన్ని వస్తువులను చౌకగా మార్చవచ్చు. ఈ మొత్తం నిర్ణయం ఒకవైపు ప్రభుత్వ పన్ను వసూలును పెంచుతుంది. మరోవైపు పొగాకు, ఫాస్ట్ ఫుడ్, తీపి పానీయాల వంటి హానికరమైన వస్తువుల నుండి ప్రజలను దూరంగా ఉంచే ప్రయత్నం కూడా.

ఇది కూడా చదవండి: Health Tips: మీకు ఎక్కువగా టీ తాగే అలవాటు ఉందా? మీరు తప్పు చేస్తున్నట్లే.. ఈ సమస్యలు తప్పవు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి