Indian Railways: 3 రాష్ట్రాలు, 11 స్టాప్‌లు.. రయ్ రయ్‌మంటూ 90 నిమిషాల ప్రయాణం.. ఎలాగంటారా.?

సాధారణ రైళ్లు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, గరీభ్‌రధ్ ట్రైన్స్.. ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందేభారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వేశాఖ

Indian Railways: 3 రాష్ట్రాలు, 11 స్టాప్‌లు.. రయ్ రయ్‌మంటూ 90 నిమిషాల ప్రయాణం.. ఎలాగంటారా.?
High Speed Train
Follow us

|

Updated on: Jul 26, 2024 | 1:02 PM

సాధారణ రైళ్లు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, గరీభ్‌రధ్ ట్రైన్స్.. ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందేభారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వేశాఖ. మొదటి హై-స్పీడ్ రైల్ కారిడార్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రానుండగా.. ఆ తర్వాత చెన్నై-మైసూరు మధ్య రెండో హై-స్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. చెన్నై టూ మైసూరు వయా బెంగళూరు ఈ హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 90 నిమిషాలకు తగ్గనుంది.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

11 స్టాప్‌లు. హై-స్పీడ్:

రెండో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలుపుతూ 463 కిలోమీటర్ల మేరకు విస్తరించనుంది. చెన్నై-మైసూరు మధ్య నడిచే ఈ బుల్లెట్ ట్రైన్‌కు కేవలం 11 స్టాప్‌లు ఉంటాయి. ఈ మార్గంలో చెన్నై, పూనమల్లి, చిత్తూరు, కోలార్, కోడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి, ఎలక్ట్రానిక్స్ సిటీ, కెంగేరి, మాండ్య, మైసూరు స్టాప్‌లుగా ఉండనున్నాయ్. గంటకు 350 కి.మీ.ల వేగంతో, 320 కి.మీ.ల వేగంతో, సగటున 250 కి.మీ.ల వేగంతో నడిచే ఈ రైళ్ల కోసం హై-స్పీడ్ కనెక్టివిటీ కారిడార్‌ను నిర్మించనుంది రైల్వేశాఖ. భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మధ్య శరవేగంగా కొనసాగుతోంది. దీని తర్వాత మైసూరు-బెంగళూరు-చెన్నై కారిడార్ మొదలు కానుందట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట

టన్నెల్ వర్క్..

ఈ ప్రాజెక్టు కోసం చెన్నైలో 2.5 కిలోమీటర్లు, చిత్తూరులో 11.8 కిలోమీటర్లు, బెంగళూరు రూరల్‌లో 2 కిలోమీటర్లు, బెంగళూరు నగరంలో 14 కిలోమీటర్ల మేర 30 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ మొదటి దశ చెన్నై నుండి బెంగళూరు వరకు 306 కిలోమీటర్లు, రెండవ దశ బెంగళూరు నుండి మైసూరు వరకు 157 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్‌లో 313 పట్టణాలు, గ్రామాలు భాగం కానున్నాయి. కాగా, మైసూరు-బెంగళూరు-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. దక్షిణాది ఆర్ధిక వృద్దిని, వేగవంతమైన ప్రయాణాన్ని, పర్యాటకాన్ని మెరుగుపరుస్తాయని అధికారుల అంచనా.

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

Chennai Bangalore

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
సల్మాన్​ బాడీగార్డ్​ నెల జీతం ఎంతో తెలిస్తే షాకే
సల్మాన్​ బాడీగార్డ్​ నెల జీతం ఎంతో తెలిస్తే షాకే
రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..