AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laptop Import Ban: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిపై నిషేధం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ ఈనోటీసులను జారీ చేసింది. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇ-కామర్స్ పోర్టల్‌ల నుంచి కొనుగోలు చేసిన కంప్యూటర్‌లతో సహా ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్‌లు లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌లు దిగుమతి అవుతున్నాయని పేర్కొంది. ఇది దిగుమతి లైసెన్స్ అవసరాల నుంచి మినహాయించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వదేశీ కంపెనీలకు కలిసివచ్చే అవకాశం ఉంది. వీరితోపాటు మన దేశంలో కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేస్తున్న వారికి ఇది అద్భుతమైన వరంగా చెప్పవచ్చు.

Laptop Import Ban: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిపై నిషేధం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Laptop
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2023 | 2:00 PM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వ్యక్తిగత కంప్యూటర్‌ల దిగుమతిపై తక్షణ నిషేధాన్ని విధిస్తూ భారత ప్రభుత్వం గురువారం నోటీసు జారీ చేసింది. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ ఈనోటీసులను జారీ చేసింది. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇ-కామర్స్ పోర్టల్‌ల నుంచి కొనుగోలు చేసిన కంప్యూటర్‌లతో సహా ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్‌లు లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌లు దిగుమతి అవుతున్నాయని పేర్కొంది. ఇది దిగుమతి లైసెన్స్ అవసరాల నుంచి మినహాయించబడుతుంది.

దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో తమ యూనిట్లను నిరంతరం ఉత్పత్తి చేస్తూ.. స్థానికంగా సరఫరా చేస్తూ, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశీయ తయారీదారులు, స్వదేశంలో తయారు చేస్తున్న విదేశీ కంపెనీలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.

మే నెలలో వచ్చిన రిపోర్టు..

గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు, సోలార్ సెల్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు తగ్గాయని మేలో GTRI నివేదిక పేర్కొంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తరపున ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతుల తగ్గుదల పీఎల్ఏ పథకం ప్రవేశపెట్టింది. దీంతో పాటు సోలార్ సెల్స్ దిగుమతి 70.9 శాతం తగ్గింది. ఈ కాలంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు (పీసీలు) దిగుమతులు 23.1 శాతం, మొబైల్ ఫోన్‌ల దిగుమతులు 4.1 శాతం తగ్గాయి.

వాణిజ్య లోటు తగ్గుతుంది

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిని నిషేధించిన తర్వాత దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తుంది. దేశ వాణిజ్య లోటు తగ్గుతుంది. దీనితో పాటు, దేశంలో సరైన వస్తువులు తయారు చేయబడతాయి. ప్రపంచ సరఫరా గొలుసు స్థానిక సరఫరా గొలుసుతో సహకరిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద వాణిజ్య లోటు చైనా, యుఎస్‌తో ఉంది. అయితే చైనాను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం