EV Subsidies: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ.. కొనుగోలుదారులకు లాభమేనా..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పై పలు రాయితీలను అందిస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి సహాయక పర్యావరణ వ్యవస్థ మెరుగుపర్చేందుకు పీఎం ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా భారతదేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్ స్కీమ్ గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులతో పాటు ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల కొనుగోలుపై రాయితీలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలకు మొత్తం 10,900 కోట్లను కేటాయించింది.

EV Subsidies: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ.. కొనుగోలుదారులకు లాభమేనా..?
Ev Subsidies
Follow us

|

Updated on: Sep 13, 2024 | 4:00 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పై పలు రాయితీలను అందిస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి సహాయక పర్యావరణ వ్యవస్థ మెరుగుపర్చేందుకు పీఎం ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా భారతదేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్ స్కీమ్ గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులతో పాటు ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల కొనుగోలుపై రాయితీలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలకు మొత్తం 10,900 కోట్లను కేటాయించింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ- బస్ సేవా-చెల్లింపు భద్రతా మెకానిజం పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఇది 33,435 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ వ్యయంతో 2028-29 వరకు భారతదేశం అంతటా 38,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంది. కొత్తగా ప్రవేశ పెట్టిన పీఎం ఈ-డ్రైవ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పీఎం ఈ -డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) కింద పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఇతర ఈవీలను ప్రోత్సహించడానికి రూ.33,679 కోట్ల విలువైన రాయితీలు లేదా డిమాండ్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లకు ప్రోత్సాహకాలు అందించడానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. అంటే పీఎం ఈ -డ్రైవ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు మద్దతు ఇవ్వదు. అయితే ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు ఇస్తుంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఇతర ఈవీలకు సబ్సిడీలు, డిమాండ్ ప్రోత్సాహకాలను అందించడంతో పాటు పీఎం ఈ-డ్రైవ్ భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాల అభివృద్ధి చేయడం కూడా కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా 88,500 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సైట్లకు మద్దతు ఇస్తుంది. పీఎం ఈ -డ్రైవ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లను, ఎలక్ట్రిక్ బస్సులకు 1,800 ఫాస్ట్ ఛార్జర్లను, ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, త్రీ-వీలర్లకు 48,400 ఫాస్ట్ ఛార్జర్లను 32,000 కోట్ల బడ్జెట్‌తో ఇన్‌స్టాల్ చేయడానికి ప్రతిపాదించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో అంకితమైన పోర్టల్ ఈవీ కొనుగోలుదారు కోసం ఆధార్ ప్రామాణీకరించబడిన ఎలక్ట్రానిక్ వోచర్‌ను జనరేట్ చేస్తుంది. ముఖ్యంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఈ-వోచర్ ని డౌన్‌లోడ్ చేసుకునేలా లింక్ వస్తుంది. కొనుగోలుదారు ఈ-వోచర్‌పై సంతకం చేసి డీలర్‌కు అందించాలి. డీలర్ కూడా ఈ-వోచర్ పై సంతకం చేసి పీఎం ఈ-డ్రైవ్ అంకితమైన పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. సంతకం చేసిన ఈ-వోచర్ కొనుగోలుదారు, డీలర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. ఆటో తయారీదారులు సంతకం చేసిన ఈ-వోచర్లను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా పథకం కింద డిమాండ్ ప్రోత్సాహకాల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..