AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో భారీ కుంభకోణానికి స్కెచ్.. ఈసారి ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి రూ. 4,760 కోట్ల రుణాలు ఎగవేత

దేశంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఈ సారి ఏకంగా 4,760 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేతకు భారీ స్కెచ్‌ వేశారు. వివిధ బ్యాంకుల నుంచి పలు దఫాలుగా జీటీఎల్ అనే కంపెనీ రుణాల సేకరించి, మూడో కంటికి తెలియకుండా దారి మల్లింపు..

మరో భారీ కుంభకోణానికి స్కెచ్.. ఈసారి ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి రూ. 4,760 కోట్ల రుణాలు ఎగవేత
GTL Scam
Srilakshmi C
|

Updated on: Jan 27, 2023 | 8:17 PM

Share

దేశంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఈ సారి ఏకంగా 4,760 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేతకు భారీ స్కెచ్‌ వేశారు. వివిధ బ్యాంకుల నుంచి పలు దఫాలుగా జీటీఎల్ అనే కంపెనీ రుణాల సేకరించింది. జీటీఎల్ లిమిటెడ్ కంపెనీ గ్లోబల్ గ్రూపుకు చెందిన మనోజ్ తివారీ 1987లో ప్రారంభించారు. దేశ విదేశాల్లో టెలికాం ఆపరేటర్లకు నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ సేవలు అందించే వ్యాపారాలు చేస్తోంది.

బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలను జీటీఎల్ లిమిటెడ్ పలు కంపెనీలకు మళ్లించి.. ఆనక వాటిని కట్టలేమని చేతులెత్తేసింది. దీనిపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోదక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ జీటీఎల్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ భారీ కుంభకోణంలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, డైరెక్టర్ల పాత్ర ఉందని.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు 24 మంది రుణదాతల కన్సార్టియం నుంచి జీటీఎల్ లిమిటెడ్ కంపెనీ లోన్ తీసుకుని మోసానికి పాల్పడిందని సీబీఐ తెల్పింది. ఐడీబీఐ లీడ్ బ్యాంకుగా ఉండి ఐసీఐసీఐ నుంచి రూ. 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 467 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 412 కోట్ల మేర రుణాలు తీసుకొని మెటీరియల్స్, వస్తువుల సరఫరా పేరిట పక్కదారి పట్టించినట్లు ఆరోపించింది. 2009లోపట్టాలెక్కిన ఈ స్కాం పలు దఫాలుగా తీసుకున్న రుణాలను ఇతర కంపెనీల షేర్ల కొనుగోలుకు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం వినియోగించినట్టు తేలింది. 2011లో ఐడీబీఐ బ్యాంక్ కంపెనీపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, విక్రేతలతో అనుమానాస్పద లావాదేవీల సమస్యను లేవనెత్తింది.

ఐతే ఈ విషయంపై లీడ్ బ్యాంక్‌ ఐడీబీఐని రిజర్వ్ బ్యాంకును ఆర్బీఐ 2016, ఏప్రిల్‌ 1న హెచ్చరించినా తన తీరు మార్చుకోలేదు. రెడ్ ఫ్లాగ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించమని ఆర్బీఐ సూచిస్తే.. అలా చేస్తే బకాయిల వసూలు మరింత ఆలస్యం అవుతుందని ఐడీబీఐ జాప్యం చేస్తూ వచ్చింది. ఐతే అదే ఏడాది జులైలో తన ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్‌ని ఆర్బీఐ నియమించింది. చివరికి నలుగురు విక్రేతలపై రూ. 1,213.97 కోట్ల బకాయిలు ఉన్నట్లు 2017లో హైడ్రామా చేశారు. నిజానికి ఆ నలుగురు విక్రేతలకు కంపెనీ సప్లయిస్‌, కంపెనీల గోడౌన్‌లు, మెటీరియల్ ఎక్కడ సరఫరా చేయబడుతున్నాయో, ఆలసు ఈ వెండర్ కంపెనీలు ఏ పనిని ఉపయోగిస్తాయో కూడా వారికి తెలియదనే విషయం సీబీఐ విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..