AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2025: వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారి టేక్ హోమ్ ఆదాయం పెరుగుతుంది. దీంతో వారికి ఎంతో ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది..

Budget-2025: వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!
Subhash Goud
|

Updated on: Dec 27, 2024 | 4:19 PM

Share

మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట లభించనుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వార్షిక ఆదాయంపై రూ.15 లక్షల వరకు పన్ను బాధ్యతను తగ్గించవచ్చని నివేదికలు ఉన్నాయి. 1 ఫిబ్రవరి 2025న సమర్పించే రాబోయే బడ్జెట్‌లో దీనిని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ ప్రతిపాదన లక్ష్యం.

2020 పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు 5-20 శాతం మధ్య పన్ను విధిస్తున్నారు. అయితే దీని కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులపై 30 శాతం పన్ను విధిస్తారు.

కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ. 3 లక్షల వరకు ఆదాయంపై 0 శాతం పన్ను విధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
  • 3-7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను.
  • 7-10 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను.
  • 10-12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను.
  • 12-15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను.
  • 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం 30 శాతం పన్ను విధిస్తున్నారు.

నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ 2024లో భారతదేశ జిడిపి వృద్ధి ఏడు త్రైమాసికాల్లో అత్యంత బలహీనంగా ఉంది. అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం పట్టణ గృహాల ఆదాయంపై ఒత్తిడిని పెంచింది. వాహనాలు, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది.

అయితే ఆదాయపు పన్ను రేట్లలో ప్రభుత్వం ఎలాంటి కోత పెట్టనుందనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆదాయపు పన్ను రేట్ల కోత వల్ల ఖజానాకు ఎంత నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు? ఆదాయపు పన్ను తగ్గింపు కారణంగా, ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు. ఇది పాత పన్ను విధానం కంటే సులభం.

మధ్యతరగతి వారికి ఉపశమనం

నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధిక జీవన వ్యయం, జీతాలు నామమాత్రంగా పెరగడం వల్ల తరచుగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆదాయపు పన్నును తగ్గించడం ద్వారా వారి చేతికి ఎక్కువ డబ్బు వస్తుందని, దీంతో వారికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఇది వ్యక్తిగత ఖర్చులను మెరుగుపరచడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వార్షిక ఆదాయం రూ. 15 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు ఈ మార్పు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

ఇది కూడా చదవండి: Manmohan Singh: నోట్లపై సంతకం చేసిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరే.. కారణం ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి