Petrol, Diesel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol, Diesel Prices Hike: యుద్ధ పరిధి విస్తరించడంతో ప్రధాన ఇంధన సరఫరాదారులుగా ఉన్న పశ్చిమ ఆసియా దేశాలు కూడా దాని పరిధిలోకి వచ్చాయి. అయితే, ఇంధన కొరత లేదని, తమ వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని భారతదేశం వాదిస్తూనే ఉంది..

Petrol, Diesel Prices Hike: మరోసారి వాహనదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. పెట్రోల్ ధర 86 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగాయి. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంచిన కేంద్రం.. తాజాగా మంగళవారం మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే కేవలం నాలుగు రోజుల్లోనే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వాహనదారులను ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురై, ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మరింత ఇబ్బందిగా మారిపోయింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం అమెరికా, ఇరాన్లు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నందున, బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది.
యుద్ధ పరిధి విస్తరించడంతో ప్రధాన ఇంధన సరఫరాదారులుగా ఉన్న పశ్చిమ ఆసియా దేశాలు కూడా దాని పరిధిలోకి వచ్చాయి. అయితే, ఇంధన కొరత లేదని, తమ వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని భారతదేశం వాదిస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: Big Alert: సామాన్యుడికి మరో షాక్.. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం..!
మే 12న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్త అంతరాయాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఉన్నప్పటికీ, భారతదేశం స్థిరమైన ఇంధన ధరలను మరియు నిరంతర ఇంధన సరఫరాలను నిర్ధారించిందని, అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దేశీయ ఎల్పిజి ఉత్పత్తిని గణనీయంగా పెంచిందని అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మరింత తగ్గుతున్న బంగారం ధరలు.. నాలుగు రోజుల్లో ఎంత తంగ్గిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




