AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Rice: సామాన్య ప్రజలకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 29 రూపాయలకే భారత్ రైస్.. పూర్తి వివరాలివే..

నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఇది పూర్తి బడ్జెట్ కాదు.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఇది. కేంద్రం ఈ బడ్జెట్ లో పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది.

Bharat Rice: సామాన్య ప్రజలకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 29 రూపాయలకే భారత్ రైస్.. పూర్తి వివరాలివే..
Bharat Rice
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2024 | 3:12 PM

Share

నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఇది పూర్తి బడ్జెట్ కాదు.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఇది. కేంద్రం ఈ బడ్జెట్ లో పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. ధరల పెరుగుదలను అరికట్టేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ చొరవ కింద సబ్సిడీ ధాన్యాన్ని రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని రూ. 29కి విక్రయించే అధికారిక నిర్ణయం వచ్చే రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో సన్నబియ్యం రూ. 50 నుంచి 60 వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. భారత్ రైస్ ను కేవలం రూ.29కి విక్రయించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఎగుమతులు, బహిరంగ మార్కెట్ అమ్మకాలపై నియంత్రణలు ఉన్నప్పటికీ.. అధికంగా ఉన్న భారీ వినియోగ బియ్యం రకాల రిటైల్ ధరలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించనుంది.

బియ్యం ధరల సమస్య ఆందోళనకరంగానే ఉంది, ఆశాజనక భారత్ రైస్ చొరవ ధరలను తగ్గించడంలో కొంత ప్రభావం చూపవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో ఉత్పత్తి, ఎఫ్‌సీఐ వద్ద పుష్కలంగా నిల్వలు, ధాన్యం ఎగుమతులపై పలు పరిమితులు, సుంకాలు విధించినప్పటికీ దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయని ఓ అధికారి తెలిపారు.

ప్రస్తుతం, ప్రభుత్వం భారత్ దాల్ కేజీ రూ. 60, భారత్ ఆటా (పిండి) కేజీ రూ.27.5 గా సబ్సిడీ ధరలకు విక్రయిస్తోంది. అదనంగా ఎఫ్‌సిఐ ఇప్పటివరకు తన మిగులు స్టాక్‌ల నుంచి బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద 7 మిలియన్ టన్నుల గోధుమలను బల్క్ గా కొనుగోలుదారులకు విక్రయించింది.

అయితే, భారత్ రైస్ కింద.. FCI వద్ద దాదాపు 0.45 MT నాన్-ఫోర్టిఫైడ్ రైస్ స్టాక్‌ను రైతుల సహకార సంస్థ నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), కేంద్రీయ భాండార్స్ వంటి ఏజెన్సీల ద్వారా రిటైల్ విక్రయాల కోసం మొదటగా అందించనున్నట్లు సమాచారం..

జూలై, 2023 నుండి FCI ప్రస్తుత సంవత్సరానికి 5 MT కేటాయింపులకు వ్యతిరేకంగా ఇప్పటివరకు వారపు ఇ-వేలం ద్వారా 0.16 MT బియ్యాన్ని మాత్రమే విక్రయించగలిగింది. డిసెంబర్‌లో రిటైల్ బియ్యం ధరలు 12.33% పెరిగాయి. అక్టోబర్ 2022 నుండి బియ్యం ధరలు పెరిగిన స్థాయిలో ఉన్నాయి. FCI స్టాక్ నుండి మిగులు బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఇది జరిగింది.

ప్రభుత్వం తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. దేశీయ సరఫరాలను మెరుగుపరచడానికి గత సంవత్సరం పార్-బాయిల్డ్ రైస్‌పై 20% ఎగుమతి సుంకాలను విధించింది. ప్రస్తుతం, ఎఫ్‌సిఐ 19.54 మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలను కలిగి ఉంది. మిల్లర్‌ల నుండి స్వీకరించదగిన 37 మెట్రిక్‌టన్లు మినహాయించి. జనవరి 1కి 7.61 MT బఫర్‌కు వ్యతిరేకంగా బియ్యం స్టాక్ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..