AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Currency: ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు వచ్చాయా..? ఎక్కడ మార్చుకోవాలి..? ఆర్బీఐ ఏం చెబుతోంది!

ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే నోట్‌లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్‌లు టెన్షణ్కు గురవుతుంటారు..

ATM Currency: ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు వచ్చాయా..? ఎక్కడ మార్చుకోవాలి..? ఆర్బీఐ ఏం చెబుతోంది!
ATM Currency
Subhash Goud
|

Updated on: Nov 14, 2022 | 10:36 AM

Share

ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే నోట్‌లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్‌లు టెన్షణ్కు గురవుతుంటారు. చిరిగిపోయిన నోట్లు చెల్లవని, అవి ఎలా మార్చుకోవాలనే దానిపై ఆందోళన చెందుతుంటారు. నకిలీ నోట్లు, చిరిగిపోయిన నోట్లకు ప్రత్యామ్నాయం ఏమిటి? అలాంటి నోట్లు మీ వద్ద ఉంటే ఎవ్వరు తీసుకోరు. అలాంటప్పుడు ఈ నోట్లను మార్చుకునే మార్గాలను సూచిస్తోంది సెంట్రల్‌ బ్యాంకు. అందుకు సులభమైన పరిష్కారం చూపిస్తోంది. మీకు ఏటీఎంలలో చిరిగిపోయినా, నకిలీ నోట్లు వచ్చినట్లయితే వాటిని బ్యాంకులు డిపాజిట్‌ చేసుకుని కొత్త నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బ్యాంకు సిబ్బంది ఆ నోట్లను తీసుకుని మీకు మంచి నోట్లను అందజేస్తుంది.

అయితే ఏటీఎంల నుంచి చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలను రూపొందించింది. ఈ నియమం ప్రకారం.. చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వచ్చినట్లయితే ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్‌బీఐ అటువంటి నోట్లను మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

అలాంటి నోట్లను మార్చడంలో బ్యాంకులు అభ్యంతరం తెలిపితే బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని గుర్తించుకోవాలి. అలాంటి బ్యాంకుకు 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. బ్యాంకు ఏటీఎం నుంచి చిరిగిన, చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంకుపైనే ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుదే. అందుకే ఏటీఎంలోనే నోట్లను డిపాజిట్ చేసేటప్పుడు వాటిని సరిచూసుకోవడం బ్యాంకు పని.

ఇవి కూడా చదవండి

నోటు సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్‌మార్క్, గవర్నర్ సంతకం వంటివి కనిపించకపోతే అది నకిలీ నోటు అని గుర్తించి నోటును మార్చుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. వాటి విలువ రూ.5000 మించకూడదు. నోట్స్ మార్చుకోవడానికి సదరు వ్యక్తి ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం వివరాలను నమోదు చేయాలి. అలాగే ఏ నోటు చిరిగిపోయిందో, ఏటీఎం స్లిప్‌ను జత చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి