Railway Insurance: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్

మే 19న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలోని ఉర్కురా రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌పై ఇనుప స్తంభం పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. షాలిమార్ ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై)కి వెళ్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

Railway Insurance: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్
Train5
Follow us

|

Updated on: May 22, 2024 | 4:30 PM

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అతి చౌకైన ప్రయాణ సాధనంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు సంభవించడం అనేది పరిపాటి మారింది. మే 19న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలోని ఉర్కురా రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌పై ఇనుప స్తంభం పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. షాలిమార్ ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై)కి వెళ్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఇది ప్రయాణీకులకు మరణం లేదా గాయం అయినప్పుడు పరిహారం అందించేందుకు భారతీయ రైల్వేలు అందించిన సదుపాయం. కాబట్టి రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం. 

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు బీమా తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీమా ప్రీమియం కేవలం 45 పైసలు, అలాగే రూ. 10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు ఈ పథకంపై అవగాహన ఉండడం లేదు. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేకంగా రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. కౌంటర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి లేదా సాధారణ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారికి ఈ బీమా యాక్సెస్ ఉండదు. ఈ బీమా ఐచ్ఛికం అంటే తీసుకోవాలా వద్దా అనేది ప్రయాణీకులపై ఆధారపడి ఉంటుంది. మీకు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే రైలు ప్రమాదంలో ప్రయాణికుడికి కలిగే నష్టాన్ని బీమా కంపెనీ భర్తీ చేస్తుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే రూ. 10 లక్షల బీమా మొత్తం అందిస్తారు. శాశ్వత పాక్షిక వైకల్యం ఉన్న సందర్భాల్లో ప్రయాణికుడికి రూ.7.5 లక్షల బీమా మొత్తం ఇస్తారు. అదే సమయంలో గాయం అయితే, చికిత్స ఖర్చుల కోసం రూ. 2 లక్షలు అందిస్తారు. 

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని పొందడం ఇలా

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందేందుకు ప్రయాణీకులు తమ ప్రయాణ తరగతితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు ఐచ్ఛిక బీమాను ఎంచుకోవాలి. బీమా కోసం మీకు కేవలం 45 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. బీమాను ఎంచుకున్న తర్వాత, నామినీ వివరాలను పూరించడానికి ప్రయాణీకుల ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌కు లింక్ పంపుతారు. బీమా పాలసీలో నామినీని కలిగి ఉండటం వల్ల బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!