AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture Success Story: ఉద్యో గం వదిలి వ్యవసాయం.. కూరగాయలు పండిస్తూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం

ఇప్పుడు వ్యవసాయం కూడా వ్యాపారం కంటే తక్కువ కాదు. దేశంలో చాలా మంది రైతులు లక్షల్లో కాదు, కోట్లాది రూపాయలను వ్యవసాయం చేస్తూ సంపాదిస్తున్నారు. ఇందుకోసం రైతులు సంప్రదాయ పంటలకు బదులు శాస్త్రీయ పద్ధతిలో పండ్లు, పూలు, కూరగాయల సాగు చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం క్రమంగా వ్యాపారంగా మారడానికి ఇదే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకున్న యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తున్న..

Agriculture Success Story: ఉద్యో గం వదిలి వ్యవసాయం.. కూరగాయలు పండిస్తూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం
Vegetable Farming
Subhash Goud
|

Updated on: Aug 03, 2023 | 4:27 PM

Share

ఇప్పుడు వ్యవసాయం కూడా వ్యాపారం కంటే తక్కువ కాదు. దేశంలో చాలా మంది రైతులు లక్షల్లో కాదు, కోట్లాది రూపాయలను వ్యవసాయం చేస్తూ సంపాదిస్తున్నారు. ఇందుకోసం రైతులు సంప్రదాయ పంటలకు బదులు శాస్త్రీయ పద్ధతిలో పండ్లు, పూలు, కూరగాయల సాగు చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం క్రమంగా వ్యాపారంగా మారడానికి ఇదే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకున్న యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తున్న అలాంటి ముగ్గురు స్నేహితుల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం చేస్తూ వారు భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు వేరే వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు.

ఈ ముగ్గురు స్నేహితులు బీహార్‌లోని పాట్నా జిల్లా వాసులు. ముగ్గురూ పాట్నాకు 20 కిలోమీటర్ల దూరంలోని బిహ్తాలో భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ రైతుల పేర్లు వినయ్ రాయ్, రాజీవ్ రంజన్ శర్మ, రంజిత్ మిశ్రా. ఈ ముగ్గురూ కూరగాయలు విక్రయిస్తూ ఏటా రూ.50 లక్షల నికర లాభం పొందుతున్నారు. 9 ఏళ్ల క్రితం తాను ముంబైలోని ఓ బ్యాంక్‌లో పని చేసేవాడినని వినయ్ రాయ్ తెలిపాడు. అయితే వ్యవసాయం చేయాలన్నది అతని కల. అందుకే ఉద్యోగం మానేసి 2014లో వ్యవసాయంలోకి వచ్చాడు.

50 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు

ఇతని పొలంలో రోజుకు 20 నుంచి 25 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు ఈ ముగ్గురు స్నేహితులు. వినయ్ పని చేసి ఉంటే తనని, తన కుటుంబాన్ని మాత్రమే పోషించగలిగేవాడు. కానీ వ్యవసాయం చేయడం ద్వారా కూరగాయల సాగు ప్రారంభించినట్లు వినయ్‌రాయ్‌ తెలిపారు. మొదట 10 ఎకరాల భూమిలో క్యాబేజీ, దోసకాయ, బ్రోకలీ సాగు చేశారు. వీటి ద్వారా భారీగా రాబడి వచ్చింది. దీని తరువాత క్రమ క్రమంగా సాగును విస్తరించాడు. ప్రస్తుతం ముగ్గురు స్నేహితులు కలిసి 50 ఎకరాల భూమిలో పచ్చి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు ఏడాదికి కోటి రూపాయలకు పైగా కూరగాయలు విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లక్షల రూపాయలు సంపాదిస్తారు

మరోవైపు, ఒక పొలంలో ఏడాదిలోపు మూడు పంటలు పండిస్తున్నానని వినయ్ రాయ్ స్నేహితుడు 45 ఏళ్ల రంజిత్ మిశ్రా చెబుతున్నాడు. దాదాపు 10 ఎకరాల్లో దోసకాయ సాగు చేశాడు. దీంతోపాటు పుచ్చకాయ, సీతాఫలం సాగు చేస్తున్నారు. గతేడాది రూ.25 లక్షల విలువైన బొప్పాయి అమ్మాడు. దీంతో పాటు క్యాబేజీ, గుమ్మడికాయ, బ్రకోలీ విక్రయాల ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి