AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? అత్యధిక బడ్జెట్‌లను ఎవరు ప్రవేశపెట్టారు?

కేంద్ర బడ్జెట్ ఆదివారం (ఫిబ్రవరి 1, 2026)న ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు.

స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? అత్యధిక బడ్జెట్‌లను ఎవరు ప్రవేశపెట్టారు?
Finance Ministers Of India
Balaraju Goud
|

Updated on: Jan 30, 2026 | 12:27 PM

Share

కేంద్ర బడ్జెట్ ఆదివారం (ఫిబ్రవరి 1, 2026)న ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు. దీనిని ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ఏప్రిల్ 7, 1860న చదివారు. స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశపు మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి నవంబర్ 26, 1947న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మొత్తం 10 బడ్జెట్‌లను మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశ సాధారణ బడ్జెట్‌ను సమర్పించిన అత్యంత విజయవంతమైన ఆర్థిక మంత్రులలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. 1991 – 1995 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించిన పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఇక మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తొలి బడ్జెట్‌ను మార్చి 19, 1996న ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. రెండవ బడ్జెట్‌ను కూడా అదే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. పి. చిదంబరం 2004 – 2008 మధ్య ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో ఆయన మళ్లీ ఆర్థిక మంత్రి అయ్యారు. 2013, 2014లో కేంద్ర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది బడ్జెట్ ప్రసంగాలు చేశారు. గతంలో ఆయన 1982, 1983, 1984లో మూడుసార్లు వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆపై కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2009 – మార్చి 2012 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఇదిలావుంటే, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుండి భారతదేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఒక తాత్కాలిక బడ్జెట్‌తో సహా మొత్తం ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ 2026లో ఆర్థిక మంత్రిగా వరుసగా తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..