AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుంచి ‘రైతులకు మహార్దశ’.. ఎందుకంటే..?

ఏపీ సర్కార్‌.. రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు వైసీపీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులకు మరో వెయ్యి అందనంగా అంటే.. మొత్తం ఇప్పుడు 13,500 ఇవ్వబోతున్నట్లు నిర్ణయించారు. వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్ సుధీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మంత్రి కన్నబాబు. కీ పాయింట్స్: రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంపు రూ.12,500కు బదులు […]

రేపటి నుంచి 'రైతులకు మహార్దశ'.. ఎందుకంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: Nikhil|

Updated on: Oct 14, 2019 | 5:20 PM

Share

ఏపీ సర్కార్‌.. రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు వైసీపీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులకు మరో వెయ్యి అందనంగా అంటే.. మొత్తం ఇప్పుడు 13,500 ఇవ్వబోతున్నట్లు నిర్ణయించారు. వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్ సుధీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మంత్రి కన్నబాబు.

కీ పాయింట్స్:

  • రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంపు
  • రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయం
  • నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ
  • ఇప్పుడు 5 ఏళ్లపాటు రూ.13,500లు ఇస్తున్న ప్రభుత్వం
  • రైతుభరోసా నాలుగేళ్లనుంచి ఐదేళ్లకు పెంపు
  • నాలుగేళ్లలో రూ.50వేలకు బదులు రూ.67,500
  • ఇచ్చిన హామీ కంటే రూ.17,500 అధికంగా ఇస్తున్న ప్రభుత్వం
  • వ్యవసాయ మిషన్‌లో రైతు ప్రతినిధుల డిమాండ్‌ మేరకు ఏటా ఇచ్చే సహాయాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం
  • రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు కీలక సందర్భాల్లో పెట్టుబడి సహాయం చేయాలన్న రైతు ప్రతినిధులు
  • రైతులు, రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వివరించిన వ్యవసాయ మిషన్‌ సభ్యులు
  • మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ
  • మేనెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు
  • రేపు నెల్లూరులో ’’వైయస్సార్‌ రైతు భరోసా’’ కార్యక్రమం ప్రారంభం.
  • రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకు, భూములపై హక్కులున్న రైతులకు దేశ చరిత్రలోనే అత్యధికంగా సహాయం అందిస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం