ఢిల్లీ మంత్రి లాక్ డౌన్ ఉల్లంఘన.. పోలీస్ కేసు నమోదు ?

ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుసేన్ కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించి దర్జాగా కారులో మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన సదర్ బజార్ లో తన 25 మంది మద్దతుదారులు..

ఢిల్లీ మంత్రి లాక్ డౌన్ ఉల్లంఘన.. పోలీస్ కేసు నమోదు ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 28, 2020 | 10:05 AM

ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుసేన్ కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించి దర్జాగా కారులో మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన సదర్ బజార్ లో తన 25 మంది మద్దతుదారులు, అనుచరులతో  ఆయన ఆర్భాటంగా కార్లలో కలయ దిరిగాడట. ఈ ‘మార్బలం’ లో ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఓ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఉన్నారని సమాచారం. ఇమ్రాన్ హుసేన్ నిర్వాకాన్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు.. అడ్డంగా వాదించాడని తెలిసింది. ఆయనకు, వారికి మధ్య జరిగిన  వాగ్యుధ్ధం వీడియోలో రికార్డయింది. లాక్ డౌన్ అమలులో ఉండగా.. సామాజిక దూరాన్ని పాటించకుండా ఇలా రోడ్లపై ఇష్టానుసారం తిరగడమేమిటని, మీరు మంత్రి అయితే మాత్రం రూల్స్ ని అతిక్రమిస్తారా అని ఖాకీలు ఆయనను ధైర్యంగా ప్రశ్నించారు. చివరకు ఆయనపై కేసు నమోదు చేయాలనే నిర్ణయించారు. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 190 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,108  కి పెరిగింది. అయితే వరుసగా రెండో రోజు ఎలాంటి డెత్ కేసూ నమోదు కాలేదు.