AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. ‘దెయ్యాల గ్రామాలు’

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. 'దెయ్యాల గ్రామాల'ను మార్చనుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సాధారణంగా వలస కూలీలకు క్వారంటైన్‌ చేసేందుకు స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను వాడుతారు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం..

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. 'దెయ్యాల గ్రామాలు'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2020 | 4:43 PM

Share

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. ‘దెయ్యాల గ్రామాల’ను మార్చనుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సాధారణంగా వలస కూలీలకు క్వారంటైన్‌ చేసేందుకు స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను వాడుతారు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం వినూత్నంగా ఆలోచించింది. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొని స్వస్థలాలకు వస్తున్న వలస కార్మికులను క్వారంటైన్ చేసేందుకు ఉత్తరాఖండ్ ‘దెయ్యాల గ్రామాలను’ వాడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇళ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో.. చాలా కుటుంబాలు అక్కడి నుంచి మెరుగైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. దీంతో అక్కడి గృహాలకు తాళాలు వేసి దర్శనమిస్తాయి. దీంతో వీటిని ‘దెయ్యాల గ్రామాలుగా’ పిలుస్తూంటారు. ప్రస్తుతం వలస కార్మికులకు క్వారంటైన్ చేసేందుకు ఈ ఇళ్లను వినియోగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పౌరి జిల్లాలో అత్యధికంగా 186 నిర్జన గ్రామాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రస్తుతం అక్కడి అధికారులు శుభ్రం చేయించారు. అన్ని సదుపాయాలూ కల్పించి 576 మందిని క్వారంటైన్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గ్రామాలు ఖాళీగానే ఉన్నాయి. రోజురోజుకీ బయటి నుంచే వచ్చే వలస కూలీల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో అక్కడి దెయ్యాల గ్రామాలను వాడుకోవడం మంచిదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

ఎండు చేపలు ఇష్టంగా తింటున్నారా? వీరికి ఎంత ప్రమాదమో తెలిస్తే..
ఎండు చేపలు ఇష్టంగా తింటున్నారా? వీరికి ఎంత ప్రమాదమో తెలిస్తే..
గణతంత్ర వేడుకల్లో 21 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు..?
గణతంత్ర వేడుకల్లో 21 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు..?
ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు
ఈ రాశుల వారికి ఈ రోజు తిరుగుండదు.. అనుకున్నది సాధిస్తారు
వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా..? ఎలాంటి సీసా వాడితే బెటర్‌.
వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా..? ఎలాంటి సీసా వాడితే బెటర్‌.
నాకు కష్టపడడంలోనే ఆనందం.. సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి
నాకు కష్టపడడంలోనే ఆనందం.. సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి
ప్రతి నెలా రూ.5 లక్షల సంపాదన! సూపర్‌ బిజినెస్‌
ప్రతి నెలా రూ.5 లక్షల సంపాదన! సూపర్‌ బిజినెస్‌
మూడోసారి SA20 ఛాంపియన్‌గా కావ్యా మారన్ టీమ్
మూడోసారి SA20 ఛాంపియన్‌గా కావ్యా మారన్ టీమ్
అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ
అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు