బాంబు పేల్చిన వైసీపీ నాయకుడు అవంతి

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్న విధంగా వాతావరణం మారింది. గతంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఇప్పుడు అందుకు రివర్స్‌లో జరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మంత్రిగా చేస్తున్న గంటా శ్రీనివాసరావు తనకంటే ముందుగానే వైసీపీలో […]

బాంబు పేల్చిన వైసీపీ నాయకుడు అవంతి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:36 PM

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్న విధంగా వాతావరణం మారింది. గతంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఇప్పుడు అందుకు రివర్స్‌లో జరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మంత్రిగా చేస్తున్న గంటా శ్రీనివాసరావు తనకంటే ముందుగానే వైసీపీలో చేరాలని భావించారట. కానీ తాను ముందుగా చేరడంతో ఆయన ఆగిపోయారంటూ బాంబు పేల్చారు. అయితే తమ పార్టీలు ఖాళీలులేవని కూడా అవంతి అన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, ఏ సామాజిక వర్గం నాయకులపై అదే సామాజిక వర్గం నాయకులతో తిట్టించడం చంద్రబాబుకు అలవాటని అవంతి విమర్శలు చేశారు.