కరోనాతో “మహా” మంత్రి.. వైద్యులు ఏం మందు ఇచ్చారో తెలుసా..?
కరోనా మహమ్మారి అందర్నీ ఒకేళా చూస్తోంది. దీనికి చిన్నా, పెద్దా తేడా లేదు. కులం, మతం, పేద,ధనిక అన్నది లేకుండా.. అందర్నీ ఎటాక్ చేస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలకు కూడా సోకింది. దీంతో వారంతా ఇప్పుడు కరోనాతో పోరాడుతున్నారు. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి కరోనా సోకడంతో.. వైద్యులు అతడికి యాంటీవైరల్ డ్రగ్ రిమెడిసివిర్ మందు ఇచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. […]
కరోనా మహమ్మారి అందర్నీ ఒకేళా చూస్తోంది. దీనికి చిన్నా, పెద్దా తేడా లేదు. కులం, మతం, పేద,ధనిక అన్నది లేకుండా.. అందర్నీ ఎటాక్ చేస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలకు కూడా సోకింది. దీంతో వారంతా ఇప్పుడు కరోనాతో పోరాడుతున్నారు. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి కరోనా సోకడంతో.. వైద్యులు అతడికి యాంటీవైరల్ డ్రగ్ రిమెడిసివిర్ మందు ఇచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పలువురు ఐఏఎస్ స్థాయి పోలీస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వీరందరికీ లీలావతి, బ్రీచ్ కాండీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ను తగ్గించేందుకు ఐఏఎస్ అధికారులకు కూడా వైద్యులు యాంటీవైరల్ డ్రగ్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత విపరీతంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి నమోదవుతున్నాయి. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది.