AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Vijayasai Reddy: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ త్వరలో విశాఖకు వస్తుందని.. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ, రాజధాని త్వరలో రావడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

MP Vijayasai Reddy: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Vijayasai Reddy
Balaraju Goud
|

Updated on: Jun 17, 2021 | 5:52 PM

Share

YCP MP Vijayasai Reddy Comments on Executive Capital: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా ఏర్పడబోతోందని కొంతమంది మంత్రులు, ఎంపీలు అంటున్నారు. ఏక్షణమైనా విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ త్వరలో విశాఖకు వస్తుందని.. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ, రాజధాని త్వరలో రావడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కసరత్తు కొనసాగుతున్నట్లు దీనికి సంబంధించిన సంకేతాలు అందుతున్నాయన్నారు.

అలాగే, వాల్యు బేసిడ్ టాక్స్ విధానం అనేది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానం దేశ వ్యాప్తంగా అమలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయమన్నారు. కొత్త దీనివల్ల వచ్చే ఏమి ఉండదన్న ఆయన.. 15శాతంకు మించి టాక్స్ పెరగదన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుగా తీసుకున్న నిధులు తెచ్చుకున్నప్పుడు గ్యారెంటీ ఇవ్వడం సర్వ సాధారణమన్న విజయసాయిరెడ్డి.. ఈ ప్రక్రియ కొత్తది కాదన్నారు. స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి అమలులో ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొత్తగా ఈ పద్ధతి అమలు చేస్తోందని దుష్ప్రచారం జరుగుతోందన్నారు.

ఇక, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో జోన్‌లో ఒక్కో కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. అలాగే, జేఎన్ఎన్‌యుఆర్ఎం, ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి మరమత్తుల నిమిత్తం ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు అందిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Read Also…  CM YS Jagan: పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఉద్యోగులను తొలగించేదీలేదు.. రెండేళ్లలో అన్ని స్కూళ్లల్లో మౌలిక సౌకర్యాలు పూర్తిః సీఎం జగన్

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా