AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెడనలో జరిగిన సీఎం సభకు హాజరైన మహిళ మృతి.. వెంటనే కుటుంబానికి చెక్ పంపిన జగన్

కృష్ణాజిల్లా పెడనలో నేతన్న నేస్తం నాలుగో విడత సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే ఈ పబ్లిక్ మీటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన ఓ మహిళ మృతిచెందింది.

Andhra Pradesh: పెడనలో జరిగిన సీఎం సభకు హాజరైన మహిళ మృతి.. వెంటనే కుటుంబానికి చెక్ పంపిన జగన్
Ap News
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2022 | 10:00 PM

Share

Krishna District: సొంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు వరుసగా నాలుగో ఏడాదీ 24 వేల ఆర్థిక సాయాన్ని అందించింది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది 80,546 కుటుంబాలకు రూ.193 కోట్లను DBT ద్వారా అందించింది. కృష్ణాజిల్లా పెడన(Pedana)లో జరిగిన సభకు ముందు మగ్గాన్ని నేశారు ముఖ్యమంత్రి. నేతన్న నేస్తం ద్వారా ఇప్పటి వరకు ప్రతి కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చామన్నారు సీఎం జగన్‌(CM Jagan). లంచాలు లేకుండా, అవినీతికి తావు లేకుండా సాయం చేస్తున్నామన్నారు. గతానికీ, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. చంద్రబాబు హయాంలో ఒకే సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 80 శాతం పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. పేదలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం జగన్‌.

సభాస్థలి వద్ద చనిపోయిన మహిళకు 10 లక్షల పరిహారం…

ఈ బహిరంగ సభకు హాజరైన మహిళ మరణించింది. విషయం తెలుసుకున్న సీఎం వెంటనే చనిపోయిన మహిళ ఫ్యామిలీకి రూ.10లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించారు. పెడన మండలం దేవరపల్లి విలేజ్‌కు చెందిన సమ్మెట రామమాణిక్యం ఈ మీటింగ్‌కు హాజరయ్యయింది. అయితే సభ జరుగుతుండగా ఆమె అకస్మాత్తుగా సొమ్మసిల్లి సృహతప్పి పడిపోయింది. వెంటనే అలెర్టయిన అధికారులు.. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు.ఈ విషయాన్ని హెలిపాడ్‌ వద్ద  ముఖ్యమంత్రికి మినిస్టర్ జోగి రమేశ్‌ తెలిపారు. దీంతో విచారం వ్యక్తం చేసిన సీఎం.. రామమాణిక్యం ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల పరిహారం వెంటనే కలెక్టర్‌కు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు..   మృతురాలి సొంతూరు దేవరపల్లి వెళ్లిన మంత్రి జోగి రమేశ్‌ మాణిక్యం డెడ్‌బాడీకి నివాళులర్పించి, ఫ్యామిలీ మెంబర్స్‌కు చెక్ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?