AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం ఎలా ఉండనుంది.. ఐఎండీ అధికారులు ఏం చెబుతున్నారు అనే విషయాలను తెలుసుకోండి..

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2024 | 8:04 PM

Share

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు..

తీవ్ర అల్పపీడనం ప్రభావంతంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ..  24 గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి పంట నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో ప్రత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణలో..

మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కోనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కోనుగోళ్లు స్పీడ్ అప్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో సైతం..

అటు హైదరాబాద్‌లో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. ఓవైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..