AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది: ఆర్డీవోకు బెదిరింపులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన తరువాత రెవెన్యూ అధికారులు తమ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ సంఘటనను చూపిస్తూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రైతు ఏకంగా రెవెన్యూ అధికారులపై పెట్రోల్ జల్లగా.. ములుగు జిల్లాలో ఓ మహిళ బడితె కర్ర పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం ముందు వీరంగం వేసింది. మరో చోట తాము […]

విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది: ఆర్డీవోకు బెదిరింపులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2019 | 12:59 PM

Share

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన తరువాత రెవెన్యూ అధికారులు తమ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ సంఘటనను చూపిస్తూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రైతు ఏకంగా రెవెన్యూ అధికారులపై పెట్రోల్ జల్లగా.. ములుగు జిల్లాలో ఓ మహిళ బడితె కర్ర పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం ముందు వీరంగం వేసింది. మరో చోట తాము ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వాలని ధర్నాలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులను ఓ వృద్ధజంట నిలదీసింది. తాజాగా కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. భూమి పాసు పుస్తకాలు జారీ చేయకపోతే విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ ఓ వ్యక్తి బెదిరించాడు.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా.. ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్‌ శాఖలోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిగా తేలింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం శివారు ప్రాంతంలో ఆ కానిస్టేబుల్‌కు చెందిన 9.12 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి వివాదంలో ఉండగా.. దానికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరిట మంజూరు చేయాలని ఈ నెల 5న శ్రీనివాస్‌రెడ్డి రాజేంద్రకుమార్‌కు ఫోన్‌ చేశాడు. లేకపోతే విజయారెడ్డికి పట్టిన గతే తనకు పడుతుందంటూ అతడు బెదిరించినట్లు రాజేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా.. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ భావిస్తున్నట్లు సమాచారం.