రీపోలింగ్లోనూ ‘చంద్రగిరి’ ఉద్రిక్తం.. టీడీపీ కార్యకర్త అరెస్ట్
చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న రీపోలింగ్లో కూడా మళ్లీ రగడ తలెత్తింది. కమ్మపల్లి పోలింగ్ బూత్లో ఓటేసేందుకు వెళ్తోన్న వృద్ధురాల్ని.. టీడీపీ కార్యకర్త ముని చంద్రనాయుడు అడ్డుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అతడిని వారించబోగా ఆయనపై వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి క్రమేపి ఉద్రిక్తతకు దారితీయడంతో.. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ముని చంద్రనాయుడిని అరెస్ట్ చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు స్థానాల్లో ఇవాళ రీపోలింగ్ జరుగుతోన్న విషయం […]
చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న రీపోలింగ్లో కూడా మళ్లీ రగడ తలెత్తింది. కమ్మపల్లి పోలింగ్ బూత్లో ఓటేసేందుకు వెళ్తోన్న వృద్ధురాల్ని.. టీడీపీ కార్యకర్త ముని చంద్రనాయుడు అడ్డుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అతడిని వారించబోగా ఆయనపై వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి క్రమేపి ఉద్రిక్తతకు దారితీయడంతో.. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ముని చంద్రనాయుడిని అరెస్ట్ చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు స్థానాల్లో ఇవాళ రీపోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే.