AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్..!

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఫుల్‌జోష్‌తో కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన అనంతరం.. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ.. సభలు కానీ నిర్వహించొద్దని.. సభా సమావేశాలకు అనుమతి కూడా లేదని ఈసీ ప్రకటించింది. సోషల్ మీడియా, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్, మరే ఇతర సాంకేతిక సాధనాల ద్వారా కూడా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది. అయితే ఈ క్రమంలో బుధవారం సాయంత్రం […]

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 21, 2020 | 7:53 AM

Share

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఫుల్‌జోష్‌తో కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన అనంతరం.. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ.. సభలు కానీ నిర్వహించొద్దని.. సభా సమావేశాలకు అనుమతి కూడా లేదని ఈసీ ప్రకటించింది. సోషల్ మీడియా, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్, మరే ఇతర సాంకేతిక సాధనాల ద్వారా కూడా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.

అయితే ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఎన్నికలు ముగిసే వరకు.. మద్యం షాపులను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు.. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని వైన్ షాపులు మూసివేస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.