AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామచంద్రపై దాడి కేసు.. చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ

చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు

రామచంద్రపై దాడి కేసు.. చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 29, 2020 | 11:24 AM

Share

AP DGP Goutam Sawang: చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అందులో గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డికి, పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరగ్గా రామచంద్ర అక్కడకు వెళ్లి ఆ వివాదంలో కలగజేసుకొని గొడవపడ్డారని అన్నారు

ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి, రామచంద్రపై దాడి చేశారని డీజీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించామని ఆయన అన్నారు. అందులో ప్రతాప్ రెడ్డి టీడీపీ కార్యకర్త అని తేలిందని వివరించారు. ఇక ఈ కేసులో వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు. మీ సంతకంతో మీడియాకు లేఖలు ఇచ్చేముందు వాస్తవాలను పరిశీలించాలని, ఏవైనా ఆధారాలుంటే ముందు తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబుకు, డీజీపీ సూచించారు.

Read More:

అంతర్వేది: డిసెంబర్ నాటికి కొత్త రథం పూర్తి

తీవ్ర జ్వరం.. ఎయిమ్స్‌లో చేరిన ఉమా భారతి