AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కరోజే వడదెబ్బకు.. ముగ్గురు మ‌ృతి..

తెలంగాణలో భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజులోనే వడదెబ్బకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లింగాల మండలంలోని అవుసలికుండకు చెందిన 55 ఏళ్ల దినసరి కూలి కేతావత్ సేవ్యా ఎండతీవ్రతకు ప్రాణాలు కోల్పోయాడు. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో వ్యవసాయపొలంలో పశువులు మేపుతూ 50ఏళ్ల చిట్టెమ్మ చనిపోయింది. వడదెబ్బకు గురై చెట్టునీడలో సేదతీరిన చిట్టెమ్మ స్రృహతప్పి పడిపోయింది. విషయం గమనించిన రైతులు.. భర్తకు సంగతి చెప్పి చిట్టెమ్మను ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించేలోగా […]

ఒక్కరోజే వడదెబ్బకు.. ముగ్గురు మ‌ృతి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2019 | 3:50 PM

Share

తెలంగాణలో భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజులోనే వడదెబ్బకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లింగాల మండలంలోని అవుసలికుండకు చెందిన 55 ఏళ్ల దినసరి కూలి కేతావత్ సేవ్యా ఎండతీవ్రతకు ప్రాణాలు కోల్పోయాడు.

పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో వ్యవసాయపొలంలో పశువులు మేపుతూ 50ఏళ్ల చిట్టెమ్మ చనిపోయింది. వడదెబ్బకు గురై చెట్టునీడలో సేదతీరిన చిట్టెమ్మ స్రృహతప్పి పడిపోయింది. విషయం గమనించిన రైతులు.. భర్తకు సంగతి చెప్పి చిట్టెమ్మను ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించేలోగా ప్రాణాలొదిలింది.

టిక్కాల మండలం ఎర్రవెల్లి చౌరస్తాకు చెందిన 35 ఏళ్ల రమేష్ మృతి చెందాడు. పెయింటర్‌గా పనిచేసే రమేష్ ఎండదెబ్బకు ప్రాణాలొదిలాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పేదవాళ్లయిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.