Ganja: గంజాయి సాగుపై పోలీసుల వరుస దాడులు.. విశాఖ ఏజెన్సీలో 259 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం..

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి తోటలపై  వరుస దాడులు చేస్తున్నాయి.   జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ల ఆదేశాల

Ganja: గంజాయి సాగుపై పోలీసుల వరుస దాడులు.. విశాఖ ఏజెన్సీలో 259 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం..
Follow us

|

Updated on: Nov 26, 2021 | 10:07 PM

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి తోటలపై  వరుస దాడులు చేస్తున్నాయి.   జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు శుక్రవారం జరిపిన విదాడుల్లో ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో సాగువుతోన్న మొత్తం 259.5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ‘ఆపరేషన్ పరివర్తన’ కార్యక్రమంలో భాగంగా ఈ దాడులు నిర్వహించారు.   గూడెంకొత్తవీధి మండలం, మొండిగెడ్డ పంచాయతీ, బూరుగుపాకలు, మోడిగెడ్డ, తొట్లగొంది, గుడివాడ, వనబలింగం గ్రామాల్లోని 139 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అదేవిధంగా జీకే వీధి మండలంం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దుప్పలవాడ పంచాయతీలోని వలసగెడ్డ , వలసగెడ్డ కాలనీ, వలసగెడ్డ కొత్తూరు , వలసపల్లి గ్రామాల్లో 65 ఎకరాల్లో గంజాయి పంటలను ధ్వంసం చేశారు.

అదేవిధంగా డుంబ్రిగుడ మండలం, గసభ పంచాయతీ , గరిదేలు, సాగర్ పంచాయతీ సున్నమెట్ట, పూజారిపుట్, కొయ్యమామిడి, జోలగూడ తదితర గ్రామాల్లో 55.5 ఎకరాల్లో సాగవుతోన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు పలువురు పోలీసు అధికారులు ఈ వరుస దాడులు నిర్వహించారు.

Also Read:

Hyderabad: మొబైల్‌ దొంగల గుట్టు రట్టు.. 4 ముఠా గ్యాంగ్‌ల నుంచి 92 సెల్‌ఫోన్లు స్వాధీనం..

Crime News: భూతవైద్యుడి రాసలీలలు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా అక్కాచెల్లిళ్లపై అత్యాచారం..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు