AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..

సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. నమ్మిన వారి నుంచి కూడా ఆడపిల్లలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆడపిల్ల ఉంటే.. ఏ సమయంలో ఎవరి ముప్పు పొంచుకొస్తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో వెంటాడుతోంది. కొన్నిసార్లు మనిషి ఆలోచన, పైశాచికానందానికి చిన్నారులు కూడా బాధితులుగా మారుతుండడం ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..
Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 1:32 PM

Share

సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. నమ్మిన వారి నుంచి కూడా ఆడపిల్లలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆడపిల్ల ఉంటే.. ఏ సమయంలో ఎవరి ముప్పు పొంచుకొస్తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో వెంటాడుతోంది. కొన్నిసార్లు మనిషి ఆలోచన, పైశాచికానందానికి చిన్నారులు కూడా బాధితులుగా మారుతుండడం ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది. కనీసం చిన్నపిల్లలని కూడా కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడే.. మానవ మృగాలు మన చుట్టూ ఉన్నాయి.. చట్టం న్యాయం ఉన్నాయి కాబట్టే.. అలాంటి వారికి తగిన శిక్షలు పడుతున్నాయి.. కొందరిలోనైనా భయం పుడుతుంది.  బాధితులకు న్యాయం జరుగుతోంది. మూడేళ్ల క్రితం విశాఖపట్నంలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పొక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూలై 2021లో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసు నమోదయింది. మర్రి పాలెం ప్రాంతంలో ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. లైన్మెన్ గా పనిచేస్తున్న అప్పన్న.. వారి పక్కింట్లోనే అద్దెకు నివాసం ఉండేవాడు. జూలై 1 2021 మధ్యాహ్నం.. బాలికను అప్పన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఆ బాలిక.. ఇంటికి వచ్చి నొప్పితో ఏడవడంతో.. ఏంటని తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని తెలుసుకొని గుండెలు పట్టుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షాధారాలను సేకరించి కోర్టులో చార్జ్ షిట్ ఫైల్ చేశారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు నిందితుడు అప్పన్నను దోషిగా తెలుస్తూ శిక్ష ఖరారు చేసింది. అప్పన్నకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు అయిదు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసులో నిందితుడికి కన్వెన్షన్ పడడానికి ప్రతిభ కనబరిచిన స్పెషల్ ఫోక్సోపీ కరణం కృష్ణకు, పోలీస్ అధికారులకు సిపి రవిశంకర్ అయ్యనార్ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం