AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచితనం గురించి ఇదివరకు ఎంతో మంది తారలు పంచుకున్నారు. హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్ సినిమాతో ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నారు.

Tollywood  : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2026 | 11:00 AM

Share

దర్శకుడు రాజా వన్నెం రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, ముఖ్యంగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి (2000) చిత్ర నిర్మాణ విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రం 26 సంవత్సరాల క్రితం విడుదలై, ఇప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం దర్శకుడిగా తనకు మొదటి అవకాశాన్ని ఎలా ఇచ్చిందో రాజా వన్నెం రెడ్డి వివరించారు. ఎడిటర్ మోహన్ (ప్రముఖ నటుడు జయం రవి తండ్రి) ఈ ప్రాజెక్టుకు ప్రధాన సూత్రధారి అని ఆయన తెలిపారు. మోహన్ కథను ఎంపిక చేసుకోవడం, నటీనటులను నిర్ణయించడంలో కీలక భూమిక పోషించారని, తాను కేవలం దర్శకత్వ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

అప్పట్లో అగ్ర తారగా వెలుగొందుతున్న రమ్యకృష్ణ, క్షేమంగా వెళ్లి లాభంగా రండిలో ప్రకాష్ రాజ్ భార్యగా ఒక ముఖ్యమైన, కానీ తక్కువ నిడివి గల పాత్రను అంగీకరించడం గురించి కూడా రాజా వన్నెం రెడ్డి మాట్లాడారు. నటీనటులు పాత్ర నిడివిని కాకుండా, దాని ప్రాముఖ్యతను చూసి ఎంపిక చేసుకుంటారని ఆయన అన్నారు. ఎడిటర్ మోహన్ రమ్యకృష్ణ పాత్రకు ప్రత్యేకమైన బ్రాహ్మణ గృహిణి క్యారెక్టరైజేషన్‌ను తీసుకొచ్చారని తెలిపారు. ఇతర సినీ ప్రముఖుల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావన వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

అలాగే సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ, ఆమె సెట్‌లో చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారని, అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండేవారని చెప్పారు. ఆమె కోపంగా ఉంటుందనే వాదనను తోసిపుచ్చారు, తాను కో-డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బావ బావమరిది సమయంలో ఆమె తనతో ఎక్కువ మాట్లాడేదని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆమె మరణం గురించి మాత్రం తాను మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. ప్రభాస్ తాతలు దాదాపు 3 వేల ఎకరాలు దానం చేశారని అన్నారు. అలాగే అడగ్గానే ప్రభాస్ రూ.30 లక్షలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

Follow Us
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?