Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur District: ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకువచ్చిన 3 కొండచిలువలు.. గ్రామస్థులు ఏం చేశారంటే

చిన్న పామును చూస్తేనే.. చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అక్కడి నుంచి వెంటనే లగెత్తుతారు. బ్రతుకు జీవుడా అంటూ పరుగు లఖించుకుంటారు. 

Guntur District: ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకువచ్చిన 3 కొండచిలువలు.. గ్రామస్థులు ఏం చేశారంటే
Pythons
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 26, 2021 | 3:09 PM

చిన్న పామును చూస్తేనే.. చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అక్కడి నుంచి వెంటనే లగెత్తుతారు. బ్రతుకు జీవుడా అంటూ పరుగు లఖించుకుంటారు.  అలాంటి వాళ్లకు భారీ కొండచిలువ కనిపిస్తే భయంతో వణికిపోతారు. అది కూడా ఒకేసారి ఏకంగా మూడు భారీ కొండచిలువలు కళ్ల ముందు ప్రత్యక్షమైతే? ఇంకేమైనా ఉందా.. వాటిని చూడగానే గుండె షేకవతుంది కదూ. ఇలాంటి షాకింగ్ దృశ్యం గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాక మండల పరిషత్ పాఠశాల వద్ద ఒకే చోట మూడు భారీ సైజున్న కొండచిలువలు హల్‌చల్‌ చేశాయి.

తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న 3 కొండచిలువలను చూసిన గ్రామస్తులు హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, యువకులు గుమిగూడి వాటిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే కొండ చిలువలను చంపడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు లేదా స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తే.. వాటిని క్షేమంగా అడువుల్లో వదిలిపెట్టేవారని.. వాటి ప్రాణాలు నిలిచేవని చెబుతున్నారు. అయితే పాఠశాల సమీపంలో అవి సంచరిస్తున్నాయని.. పిల్లలకు ప్రమాదం వాటిల్లుతుందనే భావనతో వాటిని చంపేశామని గ్రామస్థులు చెబుతున్నారు.

Also Read: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు.. శనివారం రాత్రి ఘటన

బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ