AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: విపత్తుల నిర్వహణకు టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ప్రకృతి విపత్తులు సంభవించిన వెంటనే..

TTD News: ఇటీవల తిరుమలలో కురిసిన భారీ వర్షం ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమల గిరుల్లో కొండ చరియలు విరిగి పడడంతో ఘాట్‌ రోడ్‌ ధ్వంసమైంది. దీంతో..

TTD News: విపత్తుల నిర్వహణకు టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ప్రకృతి విపత్తులు సంభవించిన వెంటనే..
Narender Vaitla
|

Updated on: Dec 22, 2021 | 7:09 PM

Share

TTD News: ఇటీవల తిరుమలలో కురిసిన భారీ వర్షం ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమల గిరుల్లో కొండ చరియలు విరిగి పడడంతో ఘాట్‌ రోడ్‌ ధ్వంసమైంది. దీంతో లింక్‌ రోడ్డుతో భక్తులకు తిరుమలకు వెళ్లడానికి అధికారులు అవకాశం కల్పించారు. అయితే అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇకపై అలాంటి పరిస్థితులు పునారవృతం కాకూడదని టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం లాంటి ప్రకృతి విప‌త్తులు సంభవించిన‌పుడు వెంట‌నే స్పందించి భారీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు చేప‌ట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకు వీలుగా విప‌త్తుల నిర్వహ‌ణ మాన్యువల్ రూపొందిస్తున్నట్టు టిటిడి జెఈవో స‌దా భార్గవి తెలిపారు. విప‌త్తులు సంభ‌వించిన‌పుడు శ్రీ‌వారి భ‌క్తుల‌కు స‌రైన స‌మాచారంతోపాటు మ‌నోధైర్యం క‌ల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయమై బుధవారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో అధికారుల‌తో స‌మీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష నిర్వహించి విప‌త్తుల నిర్వహ‌ణ‌కు త‌గిన మార్గద‌ర్శకాలు రూపొందించాల‌ని సూచించార‌ని భార్గవి తెలిపారు.

Ttd

ఈవో ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వర్యంలో ఒక క‌మిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో టీటీడీ జేఈఓ వీర‌బ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర‌రావు, డిఎఫ్‌వో శ్రీ‌నివాసులురెడ్డి స‌భ్యులుగా ఉంటార‌ని తెలిపారు. విప‌త్తుల నివార‌ణ కోసం మాన్యువ‌ల్ త‌యారీని తాను పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం వ‌ర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఈ గ్రూపులోని ఇంజినీరింగ్, ఫారెస్టు, ఐటి, ఎల‌క్ట్రిక‌ల్‌, సెక్యూరిటీ, హెల్త్ విభాగాల అధికారులతో స‌మీక్ష నిర్వహించిన‌ట్టు తెలిపారు. కంట్రోల్ రూమ్ ప్రారంభం, ముంద‌స్తు హెచ్చరిక‌లు చేసే యంత్రాంగంపై స‌మీక్ష నిర్వహించిన‌ట్టు సదా భార్గవి తెలిపారు.

Also Read: Year Ender 2021: ఈ ఏడాది ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. ఉప ఎన్నిక నిరాశపర్చినా.. ఎమ్మెల్సీల్లో కారుదే జోరు

Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. మైనింగ్‌ సైట్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 70 మంది గల్లంతు..

Lockdown In India: డిసెంబర్ 31stన లాక్ డౌన్ తప్పదా ?? నిపుణులు ఏమంటున్నారు ?? లైవ్ వీడియో

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ