AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: ఏపీ రాజకీయాల్లో సుబ్బారావు ప్రకంపనలు.. క్షణికావేశమా? కుట్ర కోణమా?

పార్లమెంట్ వేదికగా ప్రశ్నలు జవాబులతో తలపడ్డ వైసీపీ, బీజేపీ ఇప్పుడు గల్లీ పోరుకు దిగాయి. సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని కమలనాథులు అస్త్రంగా మలుచుకుంటే.. రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేస్తోంది వైసీపీ

Big News Big Debate: ఏపీ రాజకీయాల్లో సుబ్బారావు ప్రకంపనలు.. క్షణికావేశమా? కుట్ర కోణమా?
Big News Big Debate
Balaraju Goud
|

Updated on: Dec 22, 2021 | 8:50 PM

Share

Big News Big Debate: ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ లేదంటోంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అంతా బాగానే ఉంది కులమతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం మీరే అలా మాట్లాడుతున్నారంటోంది అధికార పార్టీ వైసీపీ. కొన్ని వర్గాలను టార్గెట్‌ చేసి మరీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు కమలనాథులు. మొత్తానికి నిన్నమొన్నటి దాకా పార్లమెంట్ వేదికగా ప్రశ్నలు జవాబులతో తలపడ్డ వైసీపీ, బీజేపీ ఇప్పుడు గల్లీ పోరుకు దిగాయి. సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని కమలనాథులు అస్త్రంగా మలుచుకుంటే.. రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేస్తోంది YCP.

సుబ్బారావు గుప్తాపై దాడి దృశ్యాలు వైరల్ అవుతూనే రాజకీయపార్టీలకు ఆయుధంగా మారింది. అటు కులసంఘాలు, ఇటు కషాయశ్రేణులు కత్తులు నూరుతున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు కూడా ముగియడంతో దీనిపైనే ఫోకస్‌ పెట్టారు బీజేపీ MPలు. ఈ రచ్చలోకి ఎంటరైన BJP ఏపీలో జరుగుతున్న అరాచకాలకు సుబ్బారావు గుప్తా ఘటన పరాకాష్ట అంటోంది. తాలిబన్ల తరహాలో మోకాళ్లపై కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. లా అండ్‌ ఆర్డర్‌ లేదంటున్న GVL కొన్ని వర్గాలను టార్గెట్‌ చేసి మరీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా తన దృష్టికి తేవాలంటూ E- మెయిల్‌ ఇచ్చారు సుజనా చౌదరి. ముస్లిం ఓటుబ్యాంకు దెబ్బ తింటుందనే.. సుబ్బారావుపై దాడి చేసిన వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారంటున్నారు BJP MPలు.

అటు, ఇష్యూ కులసంఘాల వరకూ చేరింది. సుబ్బారావు తల్లికి క్షమాపణ చెప్పకపోతే నడివీధిలో తీసుకొచ్చి సుబానీని కూర్చోబెడతామంటున్నారు MP టీజీ వెంకటేశ్‌. గాంధీ, పొట్టి శ్రీరాములు, రోశయ్యల్లాంటి శాంత మూర్తులే కాదు.. మా వైశ్యుల జోలికి వస్తే తాట తీస్తామని మారిపోయామని వార్నింగ్‌ ఇచ్చారు TG వెంకటేష్. అంతకుముందే వివాదం పూర్తిగా సద్దుమణిగిందని.. అయినా గుప్తాకు లేని బాధ ప్రతిపక్షాలకు ఎందుకని ప్రశ్నించారు మంత్రి బాలినేని. మంత్రి బాలినేని వివాదం చిన్నదే అంటున్నారు. కానీ విపక్షాలు మాత్రం తమకు దొరికిన ఆయుధంగా భాస్తున్నాయి. అధికార YCPపై ప్రయోగించి రాజకీయ యుద్ధం మొదలు పెట్టాయి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్) ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.