AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Lockdown: ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

AP Corona Lockdown: దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో...

AP Corona Lockdown: ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
Ttd
Narender Vaitla
|

Updated on: May 05, 2021 | 5:48 AM

Share

AP Corona Lockdown: దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో పాక్షిక లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో నేటి నుంచి రెండు వారాలా పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానున్న‌విష‌యం తెలిసిందే. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. ఇదిలా ఉంటే ఈ నేప‌థ్యంలో ప‌లు దేవాల‌యాల్లో ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల్లో అయోమ‌యం నెల‌కొంది. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో శ్రీవారి ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఉందా లేదా అన్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. దీంతో ఈ విష‌యంపై భ‌క్తుల‌కు స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి పాలకమండలి భక్తులకు స్పష్టతనిచ్చింది. శ్రీవారి దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12గంటల తర్వాత శ్రీవారి దర్శనం టోకెన్లతో వచ్చే భక్తులను అనుమతిస్తామని తెలిపింది. కర్ఫ్యూ సందర్భంగా స్వామివారి దర్శనం విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అయితే తిరుమల కొండపై కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. ఇదిలా ఉంటే నేటి నుంచి ఏపీలో అమ‌ల్లోకి రానున్న క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో.. ఏపీ సరిహద్దు వద్ద పబ్లిక్ వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. రెండు వారాలపాటు ఏపీ స‌రిహ‌ద్దుల్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని స్పష్టంచేశారు.

Also Read: ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?

AP Liquor Shops Timing: ఏపీలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మధ్యాహ్నం 12గంటల వరకే మద్యం షాపులు

AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో 20వేలకు పైగా కేసులు..