AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiruapati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

తిరుపతి(Tirupati) జిల్లా శ్రీకాళహస్తి(Srikalahasti) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రేణిగుంట -నాయుడుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో మరో 9 మంది తీవ్రంగా...

Tiruapati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
Accident
Ganesh Mudavath
|

Updated on: Apr 25, 2022 | 7:53 AM

Share

తిరుపతి(Tirupati) జిల్లా శ్రీకాళహస్తి(Srikalahasti) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. రేణిగుంట -నాయుడుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమించటంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి(Chandragiri) చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని.. మినీ వ్యాన్​లో తిరుపతికి బయల్దేరారు. శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య, సరసమ్మ దంపతులతో పాటు మారెమ్మ అలియాస్ కావ్య మృతి చెందారు. టెంపో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

Viral Video: అట్లుంటది మనతోని.. గూడు కోసం ఏకంగా జింకనే వాడేసిన కాకి.. వీడియో వైరల్

Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..