AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు..

AP Assembly: అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
Jagan And Chandrababu Ap Po
TV9 Telugu
| Edited By: Narender Vaitla|

Updated on: Mar 07, 2022 | 1:00 PM

Share

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నలు సంధించడం. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ సంస్కృతి క్రమేణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ దాదాపు రెండున్నరేళ్లు అసెంబ్లీకి హాజరుకాలేదు.. తాజాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సభకు హాజరుకాలేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరై కాసేపటికే వాకౌట్‌ చేస్తూ బయటకు వెళ్లిపోయారు.

అప్పట్లో స్పీకర్ కోడెల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా అందరూ సభ నుంచి వెళ్లిపోయారు..మళ్లీ హాజరు కాలేదు.. ప్రజాసమస్యలపై తాము మాట్లాడుతుంటే పదేపదే కట్ చేస్తుండడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీలోనే ప్రశ్నించారు.. అంతేగాక సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాకుండా జనాల్లోకి వెళ్లారు జగన్.. రాష్టవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.. తాజాగా అసెంబ్లీలో తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారంటూ సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు చంద్రబాబు..వస్తే మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెడతానన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో తన సభ నుంచి వెళ్లిపోయిన ఆయన ఈ సమావేశాలకు హాజరుకాలేదు. అసలు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాకూడదని మొదట నిర్ణయించారు..కానీ ఎందుకో ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఎమ్మెల్యేల వరకూ సభకు హాజరయ్యారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోవడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పు బట్టింది.. ప్రజాసమస్యలపై ప్రస్తావించడానికి అసెంబ్లీకి హాజరుకానీ ఎమ్మెల్యేలు అదే ప్రజధనంతో జీతాలు ఎలా తీసుకుంటారంటూ అనేకసార్లు మంత్రులు విమర్శించేవారు.. అదే మాట వైసీపీ నుంచి తాము ఎదుర్కోవాల్సి ఉంటుందనుకున్నారో ఏమో గానీ టీడీపీ ఎమ్మెల్యేలయితే సభకు హాజరయ్యారు

ప్రజాస్వామ్యంలో ఇది మంచిదేనా.?

ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి..ప్రజాస్వామ్యంలో అధికారపార్టీని నిలదీసే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది.. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించవచ్చు.. ఏదైనా బిల్లు పెడితే ఓటింగ్ లో పాల్గొనవచ్చు.. అధికారపార్టీ తప్పులను ఎత్తి చూపాలి..కాని ఇప్పుడు అలా జరగకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశమే.

అసెంబ్లీలో టీడీపీ అనూహ్య నిర్ణయం..

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలింది. సభ ప్రారంభమై గవర్నర్‌ ప్రసంగం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. వారి నినాదాలు, ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్‌ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. వారి నినాదాల మధ్యే ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు గవర్నర్‌. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి మార్షల్స్‌ వచ్చే సమయానికి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు.

అశోక్ వేములపల్లి, టీవీ9, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్.

Also Read: AP Assembly Session 2022 Live: ముగిసిన గవర్నర్‌ ప్రసంగం.. కీలక అంశాలు ఇవే..

వాహనదారులకు సూచన.. బండ్లను అలా చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే

Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..