పెళ్లికి పెద్దలు అడ్డుకున్నారని.. రైలు కింద పడి యువ జంట ఆత్మహత్య

యువతి యువకులకు ప్రేమించుకోవడం తేలికే. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకోని పెళ్లిల్లు చేస్తారు. కాని మరికొంత మంది మాత్రం కులం, మతం, డబ్బు, హోదా లాంటి వాటిని చూసి అస్సలు ఒప్పుకోరు.

పెళ్లికి పెద్దలు అడ్డుకున్నారని.. రైలు కింద పడి యువ జంట ఆత్మహత్య
Crime News
Follow us

|

Updated on: Mar 29, 2023 | 5:59 PM

యువతి యువకులకు ప్రేమించుకోవడం తేలికే. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకోని పెళ్లిల్లు చేస్తారు. కాని మరికొంత మంది మాత్రం కులం, మతం, డబ్బు, హోదా లాంటి వాటిని చూసి అస్సలు ఒప్పుకోరు. అందుకోసమే చాలామంది ప్రేమికులు తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని వారికి తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకంటారు. కొంతమందైతే పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్… అదే ఊరికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం వాళ్ల ఇంట్లో తెలియడంతో వాళ్లిద్దరికీ పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం త్రివేణి తెనాలిలోని.. డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్ తో వెళ్లడాన్ని గమనించిన త్రివేణి స్నేహితురాలు..ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. దీంతో మంగళవారం త్రివేణి తల్లిదండ్రులు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్‌ గుర్తించారు. పోలీసులు త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని వాటిని పరిశీలించారు. మృతిచెందింది తమ కుమార్తే అని నిర్ధారించుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..