Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Water: తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన ‘జల జగడం’.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ చిలికి చిలికి గాలివాన అవుతోంది. నిన్నటి వరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం..

Srisailam Water: తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన 'జల జగడం'.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!
Krishna River Board
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2021 | 10:48 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ చిలికి చిలికి గాలివాన అవుతోంది. నిన్నటి వరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం కాస్తా ఇప్పుడు పవర్ పంచాయితీగా టర్న్ అయింది. అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా.. కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే.. అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని వినియోగించటం సరికాదన్నారు. తదుపరి నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణ అధికారులను నిలువరించాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
చీపురుని పొరపాటున కూడా ఈ రోజుల్లో కొనొద్దు.. ఎందుకో తెలుసా..
చీపురుని పొరపాటున కూడా ఈ రోజుల్లో కొనొద్దు.. ఎందుకో తెలుసా..
కొండెక్కిన కొబ్బరి బోండా...ధర తెలిస్తే షాక్ అవుతారు?
కొండెక్కిన కొబ్బరి బోండా...ధర తెలిస్తే షాక్ అవుతారు?
ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో..
ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో..
అంతులేని విషాదం.. 5ఏళ్లుగా కోమా లోనే యువకుడు..మెరుగైన వైద్యం కోసం
అంతులేని విషాదం.. 5ఏళ్లుగా కోమా లోనే యువకుడు..మెరుగైన వైద్యం కోసం
మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే షుగర్
మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే షుగర్
యువతకు ష్యూరిటీ లేకుండా లోన్లు.. స్వయం ఉపాధే లక్ష్యం
యువతకు ష్యూరిటీ లేకుండా లోన్లు.. స్వయం ఉపాధే లక్ష్యం
మూఢ నమ్మకాలతో కూతుర్ని బలిచ్చిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
మూఢ నమ్మకాలతో కూతుర్ని బలిచ్చిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం!
భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం!
వేసవిసెలవుల్లో నార్త్ ఇండియా చుట్టేయండి తక్కువ ధరకే సూపర్ ప్యాకేజ
వేసవిసెలవుల్లో నార్త్ ఇండియా చుట్టేయండి తక్కువ ధరకే సూపర్ ప్యాకేజ