AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Mahanadu 2023: ఔర ఔర.. నోరూరిపోవాల్సిందే.. మహానాడులో అదిరిపోయేలా గోదావరి రుచులు..

రాజమహేంద్రవరంలో పసుపు పండగ మహానాడు.. శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్ల సందడితో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా ఒకేసారి రావడంతో ఈసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

TDP Mahanadu 2023: ఔర ఔర.. నోరూరిపోవాల్సిందే.. మహానాడులో అదిరిపోయేలా గోదావరి రుచులు..
Tdp Mahanadu 2023
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2023 | 12:14 PM

Share

రాజమహేంద్రవరంలో పసుపు పండగ మహానాడు.. శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్ల సందడితో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా ఒకేసారి రావడంతో ఈసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా మహానాడులో పొత్తులు, మేనిఫెస్టో, తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరేలా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే.. మహానాడులో టీడీపీ నేతలు గోదావరి రుచులతో విందు ఏర్పాటు చేశారు. 3500 మంది సిబ్బందితో సుమారు ఆరు లక్షల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసారు మహానాడు ఫుడ్ కమిటీ. మొదటి రోజు మహానాడు ప్రతినిధులు సమావేశంలో సుమారు యాభై వేల మందికి భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పదుల సంఖ్యలో స్టాల్స్, వందల సంఖ్యలో వడ్డించే సిబ్బంది.. అక్షయ పాత్రల్లో గోదావరి రుచుల వంటకాలతో మహానాడు వేదిక గుమగుమలాడుతోంది. ఈ రెండు రోజులు టిఫిన్, లంచ్‌, డిన్నర్‌ ఇలా.. మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా ఏర్పాటు చేశారు. ఎంతమంది కార్యకర్తలు, అభిమానులు వచ్చినా వారికి గోదావరి ప్రాంతంలో దొరికే పలు రకాల స్వీట్స్ తో పూర్తిగా శాఖాహార భోజనం అందిస్తామని ఫుడ్ కమిటీ నేతలు పేర్కొన్నారు.

రేపు మహానాడు భారీ బహిరంగ సభకు 10 లక్షల మందికి పైగా వస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల మందికి పైగా గోదావరి రుచులు ఉండనున్నాయి. సుమారు 70 కి పైగా వంటకాలు రేపు టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులకు రుచి చూపించమన్నారు.. పూర్తి శాకాహార భోజనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. భోజన కమిటీ నేతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..