AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసిన ‘పేరు’ మార్పు.. మిన్నంటిన ఆందోళనలు

ఒకే ఒక పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తమ నిర్ణయాన్ని అధికారపార్టీ వైసీపీ సమర్థించుకుంటుండగా.. ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు సైతం ప్రభుత్వ తీరును..

Andhra Pradesh: అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసిన 'పేరు' మార్పు.. మిన్నంటిన ఆందోళనలు
Tdp Protest
Amarnadh Daneti
|

Updated on: Sep 22, 2022 | 9:06 AM

Share

Andhra Pradesh: ఒకే ఒక పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తమ నిర్ణయాన్ని అధికారపార్టీ వైసీపీ సమర్థించుకుంటుండగా.. ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు సైతం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కొత్త పథకాలు, లేదా సంస్థలకు ఏ పేరు పెట్టుకున్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని, ఇప్పటికే ఉన్న ఓ సంస్థకు ఓ మహానాయకుడి పేరు తొలగించి.. వేరే నేత పేరు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. విజయవాడలోని ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలోనే కాకుండా.. సభ బయట కూడా రచ్చ కంటిన్యూ అయింది. బిల్లు విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ నిరసనలతో హోరెత్తించింది. అటు వైసీపీ మాత్రం ఎన్టీఆర్‌ పేరెత్తే అర్హత టీడీపీకి లేదంటూ ఎదురుదాడికి దిగింది. పోటాపోటీ డైలాగ్‌ వార్‌తో ఏపీ రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహనీయుడి పేరు మార్చడం సిగ్గు సిగ్గంటూ నినాదాలు చేశారు. యూనివర్శిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుంటూరులోనూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అత్యంత హేయమైన చర్య అంటూ నాయకులు మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పేరు మార్పుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళనలు కొనసాగాయి. వైసీపీ ప్రభుత్వం తక్షణమే పేర్పు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదంటూ వైసీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఎన్టీఆర్ ను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడింది. ఎన్టీఆర్‌ అంటే తమకు, తమ పార్టీకి ఎంతో గౌరవం ఉందన్నారు మంత్రి జోగి రమేష్‌. అందుకే విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టామన్నారు. మొత్తం మీద ప్రతిపక్షాల ఆందోళనలు జరుగుతున్నప్పటికి ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతూ.. ఉభయసభల్లో హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి