వీడిన గోవుల మృతి మిస్టరీ.. “సిట్” ఏం చెబుతోందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ గోవుల మృతిపై దర్యాప్తు చేసిన సిట్.. తన నివేదికను సమర్పించింది. విజయవాడ నగర శివారులోని తాడేపల్లి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయి. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించాయి. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని గో ప్రేమికులు.. రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ప్రభుత్వం స్పందించింది. ఈ […]

వీడిన గోవుల మృతి మిస్టరీ.. సిట్ ఏం చెబుతోందంటే..?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 5:55 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ గోవుల మృతిపై దర్యాప్తు చేసిన సిట్.. తన నివేదికను సమర్పించింది. విజయవాడ నగర శివారులోని తాడేపల్లి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయి. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించాయి. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని గో ప్రేమికులు.. రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే సుధీర్ఘంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు.. గోవుల మృతికి గల కారణాలను తేల్చారు. గోవులు తీసుకున్న గ్రాసమే.. మరణాలకు కారణమని తేల్చింది సిట్. ఆ గ్రాసంలో అధికంగా నైట్రేట్లు ఉండటంతో తిన్నవెంటనే.. ఆ గ్రాసం విషపూరితంగా మారి.. మరణాలకు కారణమైందని తేల్చింది.

పశుగ్రాసంలో ఉండాల్సిన నైట్రేట్ల శాతంలో భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 1.6 శాతం ఉంటుందని.. అయితే ఘటన జరిగిన రోజు.. గోవులు తిన్న గ్రాసంలో 2 నుంచి 3 రెట్లు అధికంగా ఈ నైట్రేట్ల శాతం ఉండటంతో.. ఆ గ్రాసం విష పూరితంగా మారినట్లు సిట్ నివేదికలో తేలింది. మృతి చెందిన గోవులు తిన్న ఆ గ్రాసంలో 3.79 గ్రాముల నుంచి 4 .47 గ్రాముల వరకు నైట్రేట్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఎక్కువ శాతం నైట్రేట్లు.. హీమో గ్లోబిన్‌లోకి వెళ్లిన తర్వాత చర్య జరిగి మెత్‌ హీమోగ్లోబిన్‌గా మారింది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్‌కు ప్రాణవాయువును తీసుకెళ్లే సామర్థ్యం తగ్గడంతో శ్వాస ఆగిపోయి గోవులు మృతి చెందాయని తేలింది. ఎఫ్ఎస్‌ఎల్ ల్యాబ్, వెటర్నరీ ల్యాబ్, పరిశోధన ల్యాబ్ పరీక్షల అనంతరం.. సిట్ ఈ వివరాలను వెల్లడించింది.