AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అర్ధరాత్రి వేళ దేవరపల్లిలో జీడిగింజల లారీ బోల్తా.. ఏడుగురు కూలీలు దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం (సెప్టెంబర్‌ 11) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో సహా 10 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం..

Andhra Pradesh: అర్ధరాత్రి వేళ దేవరపల్లిలో జీడిగింజల లారీ బోల్తా.. ఏడుగురు కూలీలు దుర్మరణం
Devarapalli Lorry Accident
Srilakshmi C
|

Updated on: Sep 11, 2024 | 6:34 AM

Share

దేవరపల్లి, సెప్టెంబర్‌ 11: తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం (సెప్టెంబర్‌ 11) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో సహా 11 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్తే..

ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన డీసీఎం మినీ లారీ బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళ్తుండగా చిన్నయగూడెం శివారు వద్ద అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అనంతరం చెట్ల పొదల్లో బోల్తా పడింది. దీంతో వాహనం ట్రక్కులో కూర్చుని ఉన్న తొమ్మిది మంది కూలీలు వాహనం కింద పడిపోయారు. వాహనం తిరగబడటంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిని తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏడుగురు తాడిమళ్లకు చెందిన వారిగా గుర్తించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌.. అనే కూలీలు ఈ ఘటనలో మృతి చెందారు.

ప్రమాదం అనంతరం డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో డ్రైవర్‌ ప్రమాదం అనంతరం పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం