Sajjala Ramakrishna Reddy: “ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం”

జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy: ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం
Sajjala Ramakrishna Reddy
Follow us

|

Updated on: Jul 04, 2021 | 4:08 PM

జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వాటా కింద దక్కిన నీటిలో ఒక్క చుక్కను కూడా వదులుకోమని సజ్జల స్పష్టం చేశారు. జలవివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని వివరించారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని చెప్పుకొచ్చారు. రెచ్చగొడితే రెచ్చిపోం, సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు.

నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

తెలుగు రాష్టాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన తెలంగాణ సీఎంకు ఉందని… గతంలో తిరుమలకు వచ్చిన కేసీఆర్ వ్యాఖ్యానించారని నారాయణస్వామి తెలిపారు. తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌ దాఖలు చేశారు.   హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీరు వదలటం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషన్​లో ప్రస్తావించారు.

Also Read: మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిసి అతడి దిమ్మతిరిగిపోయిందిTV9 Telugu – Water I

సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఆదివారం చేప‌ల మార్కెట్ల వ‌ద్ద ఏందీ లొల్లి

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?