Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రత్తిపాడు వైసీపీలో విభేదాలు.. ‘మనిషిగా కూడా చూడట్లేదు’ అంటూ ఎమ్మెల్యేపై మహిళా ఎంపీపీ ఫిర్యాదు..

Kakinada News in Telugu: ప్రత్తిపాడు వైసీపీలో బయటపడ్డ విభేదాలు ఆ పార్టీలో అంతర్గత పోరుని బజార్లోకి నెట్టాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర వరప్రసాద్‌పై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు రౌతులపూడి ఎంపీపీ గంటిమల్లి రాజ్యలక్ష్మి. ఎంపీపీగా ఎన్నికైనా..

Andhra Pradesh: ప్రత్తిపాడు వైసీపీలో విభేదాలు.. ‘మనిషిగా కూడా చూడట్లేదు’ అంటూ ఎమ్మెల్యేపై మహిళా ఎంపీపీ ఫిర్యాదు..
Prathipadu MLA Parvatha Sri Purnachandra Prasad; Rautulapudi MPP Gantimalli Rajyalakshmi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 13, 2023 | 5:57 AM

Kakinada News in Telugu: ప్రత్తిపాడు వైసీపీలో బయటపడ్డ విభేదాలు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుని బజార్లోకి నెట్టాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర వరప్రసాద్‌పై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు రౌతులపూడి ఎంపీపీ గంటిమల్లి రాజ్యలక్ష్మి. ఎంపీపీగా ఎన్నికైనా కనీసం మండల సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ ఆరోపించారు. ఎస్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ఎన్నో చేస్తున్నా ఫలితం లేకుండాపోతోందన్నారు. కనీసం విద్యాకానుక కార్యక్రమానికి తనను పిలవలేదని ఆరోపించారు. కేవలం తాను ఎస్టీని కావడం వల్లే మనిషిగా కూడా చూడకుండా అవమానిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు కంప్లైంట్‌ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

మరోవైపు ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది ఎంపీపీ రాజ్యలక్ష్మి. అధికార పార్టీలో గెలిచిన తనను ఎస్టీ మహిళ కావడం వల్లనే మండల కార్యకలాపాలకు దూరం పెడుతూ అవమానిస్తున్నారని ఆరోపించారు. గతంలో రెండు సార్లు కలెక్టర్ కి ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినా ఎవరూ సరిగా స్పందించలేదన్నారు రాజ్యలక్ష్మి. కలెక్టర్‌గారి ద్వారా సమాధానం రాకపోతే.. ఎస్టీకమిషన్‌కి ఫిర్యాదు చేశానన్నారు. అసలు తన ఫిర్యాదుపై ఏం జరిగిందో కూడా అధికారులు సైతం సమాధానం చెప్పడంలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..