AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో వైసీపీకి తలనొప్పిగా మారిన ఈ సమస్య..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసిపి ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్య వెంటాడుతోంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం కలకలం రేపుతుంది. దీంతో నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు.

కర్నూలులో వైసీపీకి తలనొప్పిగా మారిన ఈ సమస్య..
Tdp,Ycp
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 04, 2024 | 7:30 PM

Share

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసిపి ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్య వెంటాడుతోంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం కలకలం రేపుతుంది. దీంతో నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు.

కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ నగరానికి కొత్త. ఎన్నికలలో పోటీకోసమే ఐఏఎస్‎కి రిజైన్ చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇప్పించకుండా ఉండటం కోసం విఫల యత్నం చేశారు.

కోడుమూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్‎ది నేటివ్ కర్నూలు జిల్లానే కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు. మంత్రి ఆదిమూలపు సురేష్‎కి స్వయానా సోదరుడు. ఆయనకి కోడుమూరు టికెట్ రావడంతో.. టికెట్ ఆశించి భంగపడిన దాదాపు పది మంది నేతలు నాన్ లోకల్ సమస్య తీసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మిగనూరులో కూడా వైసీపీలో కొంత నాన్ లోకల్ సమస్య ఉంది. బుట్ట రేణుకది ఎమ్మిగనూరు నేటివ్ కాదు. అయితే రేణుక ఎంపీగా పనిచేసిన కర్నూలు పార్లమెంటు పరిధిలోనే ఎమ్మిగనూరు ఉంది. దీంతో ఇది నాన్ లోకల్ కిందికి రాదని ఆమె వాదిస్తున్నారు.

ఆదోనిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థానాన్ని తెలుగుదేశం.. బిజెపికి కేటాయించింది. డాక్టర్ పార్థసారథి బిజెపి తరఫున అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్థసారధి లోకల్ కాదని నాన్ లోకల్ అని టిడిపి టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా టిడిపి అధిష్టానం దూతలను పంపి వివరణ ఇప్పిస్తున్నారు.

నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‎ని పార్టీ ప్రకటించింది. సుధీర్ నాన్ లోకల్. ఉమ్మడి కర్నూలు జిల్లానే కాదు. పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి. గతంలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. దీంతో నాన్ లోకల్‎కి టికెట్ ఇచ్చారంటూ వైసీపీ నందికొట్కూరు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే