TDP vs YCP: లోకేష్‌కు వెల్కమ్ చెబుతూ ఫ్లెక్సీల ఏర్పాటు.. చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు

Surya Kala

Surya Kala | Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 3:41 PM

యువ గళం జెండాలు కట్టిన తెలుగు యువత కార్యకర్తలకు సంబంధించిన బైక్‌లపై దాడి చేశారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘర్షణ చెలరేగింది.

TDP vs YCP: లోకేష్‌కు వెల్కమ్ చెబుతూ ఫ్లెక్సీల ఏర్పాటు.. చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు
Tdp Vs Ycp In Palamaneru

ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి పైగా ఎన్నికలకు సమయం ఉన్నా..  ఎన్నికల వేడి మొదలైంది. అధికార ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా ప్లెక్సీలు చింపేశారని.. వైసీపీ, టీడీపీ నేతలు దాడులు చేసుకున్నారు. దీంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేసి, కాల్చేశారు. అయితే ఇది వైసీపీ కార్యకర్తల పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

యువ గళం జెండాలు కట్టిన తెలుగు యువత కార్యకర్తలకు సంబంధించిన బైక్‌లపై దాడి చేశారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘర్షణ చెలరేగింది. వెంటనే అలెర్టయిన పోలీసులు.. కాల్చిన ఫ్లెక్సీని పీఎస్‌లోకి తీసుకెళ్లారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించారు. బైరెడ్డిపల్లిలో నిన్న లోకేష్ పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా.. స్థానిక టీడీపీ నేతలు బ్యానర్లు కట్టారు. వాటిని పీకేయడంతో.. గొడవ మొదలైంది. వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని తెలిసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు టీడీపీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu