AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: పహల్గాంలో ఉగ్రదాడి.. ఏపీ బాధితుల కోసం మంత్రి లోకేష్ కీలక పోస్ట్!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎమర్జెన్సీ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు మంత్రి లోకేష్‌ తెలిపారు. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం కావాలన్న (9818395787) కాల్‌ చేయాలని మంత్రి లోకేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

Nara Lokesh: పహల్గాంలో ఉగ్రదాడి.. ఏపీ బాధితుల కోసం మంత్రి లోకేష్ కీలక పోస్ట్!
Lokesh
Anand T
|

Updated on: Apr 23, 2025 | 5:44 PM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎమర్జెన్సీ డెస్క్‌ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జమ్మూకాశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ఎమర్జెన్సీ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు మంత్రి లోకేష్‌ తెలిపారు. బాధితులకు ఎటువంటి సహాయం అవసరం అయినా 9818395787 నంబర్ కు కాల్ చేయాలని తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగువారు చనిపోయారు. విశాఖ జిల్లా పాండురంగపురంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమళి ఉగ్రవావాదుల కాల్పుల్లో మృతి చెందాడు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. దీంతో ప్రత్యేక విమానంలో చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకు రానున్నారు.

ఈ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావాలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కూడా చనిపోయారు. బెంగళూరులోని స్థిరపడ్డ మధుసూదన్ IBM సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఘటన ఈ దుర్ఘటన జరిగింది. మధుసూదన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఇంటర్​చదువుతుండగా, కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..