AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిందెలకు బిందెలు పానకం తాగేస్తున్న నరసింహ స్వామి.. భక్తితో సమర్పిస్తున్న జనాలు.. ఎక్కడో తెలుసా?

హిందూవులలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఒక్క హిందువు తాము కొలిచే దైవానికి నైవేద్యం సమర్పిస్తారు.అయితే మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు సమర్పించే నైవేద్యాన్ని సగం స్వీకరించి మిగతా సగం తిరిగి ఇస్తారట..ఇలా ప్రతి నెల స్వామివారు స్వీకరించే నైద్యానికి సంబంధించిన లెక్కలను తాజాగా విడుదల చేశారు అధికారులు.

బిందెలకు బిందెలు పానకం తాగేస్తున్న నరసింహ స్వామి.. భక్తితో సమర్పిస్తున్న జనాలు.. ఎక్కడో తెలుసా?
Ap News
T Nagaraju
| Edited By: |

Updated on: Dec 02, 2025 | 3:33 PM

Share

మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందిన విషయం అందిరికి తెలిసిందే.అయితే ఆయలం పక్కనే ఉన్న కొండలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు నిత్యం ఎంతో భక్తిశ్రద్దలతో పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.అందుకే ఇక్కడ స్వామిని పానకాలలక్ష్మీ నరసింహ స్వామి అంటారు. అయితే ఇక్కడి ప్రత్యేక ఏంటంటే భక్తులు పోసిన పాయసంలో సగాన్ని స్వామి వారు తాగి మిగతా సగాన్ని భక్తులక ప్రతీది.

స్వామి వారు తిరిగి ఇచ్చిన పానకాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు.స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో నమూచి అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత మంగళగిరి కొండ బిలంలో ఉగ్రరూపంలో వెలిశారని చెబుతారు.ఉగ్రరూపంలో ఉన్న స్వామి వారిని శాంత పరిచేందుకు త్రేతాయుగంలో అమ్రుతాన్ని,ద్వాపర యుగంలో ఆవుపాలను,కలి యుగంలో పానకాన్ని సమర్పిస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇంతటీ ప్రాశస్త్యం ఉండటంతో ఆలయ అధికారులే పానకాన్ని తయారు చేసి భక్తులకు విక్రయిస్తారు.

అయితే స్వామి వారు రోజు ఎంత పానకాన్ని స్వీకరిస్తున్నారు. నెలకి ఎంత అన్న లెక్కలను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఆలయ అధికారుల లెక్కల ప్రకారం యాభై వేల లీటర్ల పానకాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు.అయితే సగం స్వీకరించి మిగిలిన సగాన్ని వదిలి వేస్తారు కాబట్టి భక్తులు ప్రతి నెల లక్ష లీటర్ల పానకాన్ని స్వామి వారికి ఇస్తున్నారు భక్తులు.

ఇక్కడ పానకాన్ని బిందెల్లో పూజారులు అందిస్తుంటారు.ఒక్కో బిందెలో 2.5 లీటర్ల పానకం పడుతుంది.ఇటువంటి బిందెలు ప్రతి నెలా 40 వేలు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.దీంతో లక్ష లీటర్ల పానకాన్ని భక్తులు సమర్పిస్తుంటే యాభై వేల లీటర్ల పానకాన్ని స్వీకరించిన స్వామి మరో యాబై వేల లీటర్ల పానకాన్ని భక్తులు విడిచి పెడుతున్నారు. స్వామి వారి పానకంపై అధికారులు లెక్కలు విడుదల చేయడంతో భక్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.