AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణం విద్యుత్‌ నగర్‌లో తెల్లవారుజామున దారుణహత్య జరిగింది. పిల్లనిచ్చిన అత్తనే అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై కూడా

Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
crime news
Jyothi Gadda
|

Updated on: May 18, 2022 | 12:23 PM

Share

కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణం విద్యుత్‌ నగర్‌లో తెల్లవారుజామున దారుణహత్య జరిగింది. పిల్లనిచ్చిన అత్తనే అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై కూడా దాడిచేయటంతో మామ, బావమరిదికి కూడా గాయలయ్యాయి. 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

విద్యుత్‌ నగర్‌కు చెందిన రమణమ్మ, సత్యన్నారాయణల కూతురు దివ్యకు, కొత్త కందరాడకు చెందిన సైతన రమేష్‌తో ఐదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, రమేష్‌ భార్య దివ్య గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. దీంతో అత్తామామలపై అక్కసు పెంచుకున్నాడు రమేష్‌. తన భార్యను కాపురానికి పంపటంలేదనే ఆగ్రహంతో అత్తవారింటికి వెళ్లాడు. ఉదయానే రమణమ్మ ఇంటిముందు వాకిలి తుడిచేందుకు గేటు తీసింది. అప్పటికే గేటు బయట ఉన్న ఆమె అల్లుడు రమేష్ ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ఆమె భర్త సత్యన్నారాయణ, కుమారుడు దిలీప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. కత్తితో రమణమ్మ మేడపై ఒక్కసారిగా వేటు వేయటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహయంతో వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..