Kidnap Case: కర్నూలులో సినిమాను తలపించిన కిడ్నాప్.. గుడిలో పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్న ప్రేమికులిద్దరినీ..
Kidnap Case: కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఓ కిడ్నాప్ ఘటన సినిమాను తలపించింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన
Kidnap Case: కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఓ కిడ్నాప్ ఘటన సినిమాను తలపించింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన జంటను.. యువతి మేనమామ కిడ్నాప్ చేసిన బంధించాడు. చివరికి పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి గ్రామానికి చెందిన అనిల్ కుమార్, నందికొట్కూరు కు చెందిన ఓ యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వీరిద్దరూ బంధువులు కూడా కావడంతో.. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారు. పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. వీరి ప్రేమ వ్యవహారం కారణంగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దాంతో యువతీ యువకుడు ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో ఇంట్లోంచి పారిపోయారు.
అయితే, నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్డులో ఉన్న బ్రహ్మం గారి గుడిలో పెళ్లి చేసుకునేందుకు స్నేహితుల సహాయంతో ప్రేమికులిద్దరూ ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు ప్రత్యేక వాహనంలో గుడికి బయలుదేరారు. కానీ అంతలోనే అనుకోని అవాంతరం వారికి ఎదురైంది. వీరి ప్రేమ వివాహం గురించి తెలుసుకున్న యువతి మేనమామ మునుస్వామి వారి వాహనాన్ని వెంబడించాడు. తన అనుచరులతో కలిసి కారులో వచ్చిన మునుస్వామి.. అనిల్, యువతిని కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలోనే ప్రేమికులిద్దరూ పోలీసులకు ఫోన్ చేశారు. తాము కిడ్నాప్కు గురయ్యామని ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేశారు. కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ప్రేమికులిద్దరినీ రక్షించారు. అయితే ప్రేమికులిద్దరినీ నందికొట్కూరు పీఎస్కు తరలించిన పోలీసులు.. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాలతో చర్చించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
Also read: