Yanam: యానాంను ముంచెత్తిన గోదావరి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పర్యటన

కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పరీవాహక ప్రాంతాలను కకావికలం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ముంపు ప్రాంతాలను ముంచేసింది. ప్రస్తుతం వరద ఉద్ధతి తగ్గుతున్నప్పటికీ.. భద్రాచలం, ధవళేశ్వరం (Dhawaleshwaram Barrage) వద్ద...

Yanam: యానాంను ముంచెత్తిన గోదావరి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పర్యటన
Governor Tamilisai
Follow us

|

Updated on: Jul 19, 2022 | 10:38 AM

కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పరీవాహక ప్రాంతాలను కకావికలం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ముంపు ప్రాంతాలను ముంచేసింది. ప్రస్తుతం వరద ఉద్ధతి తగ్గుతున్నప్పటికీ.. భద్రాచలం, ధవళేశ్వరం (Dhawaleshwaram Barrage) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. మంగళవారం యానాం (Yanam) లో పర్యటించనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటన కోసం గవర్నర్ తమిళిసై.. హైదరాబాద్‌ నుంచి ఉదయం 8.45 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యానాం వెళ్లనున్నారు. యానాంలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4,400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో నాలుగు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పుదుచ్చేరి విపత్తు నిర్వహణ అథారిటీ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తమిళసేవన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వర్షాలు తగ్గుముఖం పట్టి, వరద ఉద్ధృతి తగ్గుతున్నా.. యానాం లో మాత్రం పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. అంతే కాకుండా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా గోదావరికి (Godavari) చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే సామగ్రి దొంగల పాలవుతుందని భయపడి, సురక్షిత ప్రాంతానికి వెళ్లడం లేదు.

కాగా.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలానికే మాత్రమే గవర్నర్ పర్యటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి