AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన నిద్ర మత్తు.. దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు భక్తులు..వివరాలు ఇవే..!

డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి అదుపు తప్పిన నడిపిస్తున్నాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మరో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులు, మృతుల వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను వెల్లడించారు.

కొంపముంచిన నిద్ర మత్తు.. దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు భక్తులు..వివరాలు ఇవే..!
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 29, 2025 | 1:57 PM

Share

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఇందులో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్క హోసల్లి కి చెందిన ఐదుగురు మృతి చెందారు. స్విఫ్ట్ డిజైర్ కారులో మంత్రాలయం వస్తుండగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు చిన్నారులు. ముగ్గురి మృతి దేహాలు ఇంకా కారులోనే ఇరుక్కున్నాయి. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి అదుపు తప్పిన నడిపిస్తున్నాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మరో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులు, మృతుల వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను వెల్లడించారు.

వెంకటేశప్ప, 76 సంవత్సరాలు,

ఇవి కూడా చదవండి

సతీష్ కుమార్,వయసు 34 సంవత్సరాలు,

మీనాక్షి,వయసు 32 సంవత్సరాలు,

బణీత్ గౌడ,, వయసు 5 సంవత్సరాలు,

రిత్విక్, వయసు 4 సంవత్సరాలు,

ఎమ్మిగనూరు నుండి ఆదోని వైపుకు వెళ్తున్న హైదరాబాద్ నుండి వస్తున్న (విజయనగరం వాసులు) FORTUNER (AP39SS2020) కారులో వస్తున్న అశోక్, రాధిక, జాహ్నవిలు ఆదోని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్లో, అక్కడి నుంచి ఫార్చునర్ లో ఆదోని వెళుతుండగా కర్ణాటక కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.